News November 20, 2025
చేపలకోసం వల వేస్తే.. చిక్కిన కొండచిలువ

చేపల కోసం ఓ జాలరి వేసిన వలలో చేపలకు బదులు కొండచిలువ పడిన ఘటన తాడేపల్లిలో చోటుచేసుకుంది. రైల్వే బ్రిడ్జి పంప్ హౌస్ వద్ద బకింగ్ కెనాల్ కాలువలో గురువారం ఓ జాలరి చేపలు పట్టేందుకు కృష్ణా నదిలోకి వల వేయగా కొద్దిసేపటికి వల బరువుగా తగిలింది. దీంతో చేపలు బాగా పడ్డాయి అనుకుంటూ వలనిపైకి తీసి చూడగా అందులో ఉన్న కొండచిలువను చూసి ఒక్కసారిగా అవాకయ్యాడు. తాను ఎప్పుడూ ఇలా పాము రావడం చూడలేదని జాలరి చెప్పాడు.
Similar News
News January 24, 2026
అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన DGP

అమరావతి ప్రాంతంలో రాష్ట్రం ఏర్పడ్డాక రిపబ్లిక్ డే వేడుకలు రాష్ట్ర స్థాయిలో మొట్టమొదటి సారిగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఓ వైపు ఆ ప్రాంతంలో ప్రాక్టీస్ పెరేడ్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఆ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పరిశీలించారు. భద్రత ఏర్పాట్లు, పార్కింగ్, ఇతర విషయాల గురించి స్థానిక అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.
News January 24, 2026
GNT: సినీ సంగీత పితామహుడు బి.ఎన్.ఆర్ జయంతి

తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుల్లో ఆద్యులైన భీమవరపు నరసింహారావు జయంతి నేడు. గుంటూరు జిల్లా కొలకలూరులో 1905 జనవరి 24న ఆయన జన్మించారు. చిన్ననాడే సంగీతంపై మక్కువతో స్వయంగా హార్మోనియం నేర్చుకున్నారు. తెనాలిలోని శ్రీరామ విలాస సభ ద్వారా నాటక రంగానికి పరిచయమయ్యారు. 1936లో ‘సతీ తులసి’ చిత్రంతో సినీ ప్రస్థానం ప్రారంభించి మాలపిల్ల, రైతుబిడ్డ, ద్రౌపదీ వస్త్రాపహరణం, అర్ధాంగి వంటి చిత్రాలకు సంగీతం అందించారు.
News January 24, 2026
తుళ్లూరు: వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి క్రెడిట్ కార్డు

ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్ ఆత్మ నిర్భర్ నిధిలో భాగంగా ఏపీ సీఎం CBN పీఎం స్వనిధి క్రెడిట్ కార్డు ప్రారంభించి వీధి వ్యాపారులకు అందజేశారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వీధి వ్యాపారులకు రూ. 206 కోట్ల రుణం పంపిణీ చేశారు. వీధి వ్యాపారును ఆర్థికంగా బలోపేతం చేయటమే ఈ పథకం ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో MEPMA డైరెక్టర్ వాకాటి కరుణ ఐఏఎస్ పాల్గొన్నారు.


