News February 22, 2025
జగిత్యాల: అతివేగంతో ఒకరి మృతి.. 18 నెలల జైలు!

JGTL జిల్లా ధర్మపురి PS పరిధిలోని రాయపట్నం గ్రామానికి చెందిన గటికే కృష్ణమూర్తి అనే వ్యక్తి 2018 మే 2న బైక్పై రాత్రి రామయ్యపల్లె నుంచి రాయపట్నం వైపు వెళ్తుండగా అతివేగంతో వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో కృష్ణమూర్తి అక్కడికక్కడే మృతి చెందడంతో కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడు లారీ డ్రైవర్ జగిరి మల్లేష్ (26)కు జడ్జి శ్రీ శ్యామ్ ప్రసాద్ 18 నెలల జైలు శిక్ష, రూ.5500 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.
Similar News
News March 22, 2025
రాజమండ్రిలలో P4పాలసీ కార్యక్రమం

P4 పాలసీ కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గర్గ్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. P4 పాలసీ ద్వారా ప్రభుత్వం వెనుకబడిన కుటుంబాలను ప్రత్యక్షంగా దత్తత తీసుకుని వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి సహాయపడుతుందని అన్నారు. ప్రజల నిజమైన అవసరాలను తీర్చడం, వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే వారి అభివృద్ధికి తోడ్పాటు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.
News March 22, 2025
HYD: ఇన్స్టాలో పరిచయం.. హోటల్లో అత్యాచారం

అల్వాల్ PSలో ఇద్దరు బాలికలు అదృశ్యమైనట్లు ఫిర్యాదు అందింది. దర్యాప్తులో బాలికలు ఓ హోటల్ గదిలో ప్రత్యక్షమయ్యారు. పోలీసుల వివరాలలా.. దమ్మాయిగూడకు చెందిన సాత్విక్ (26), కాప్రాకు చెందిన మోహన్చందు (28)లకు మచ్చ బొల్లారానికి చెందిన బాలికలతో ఇన్స్టాలో పరిచయం అయింది. యువకుల మాటలు నమ్మి బాలికలు 3 రోజుల క్రితం కుషాయిగూడలోని ఓ హోటల్కు వెళ్లగా లైంగికదాడి చేశారు. కేసు నమోదైంది.
News March 22, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

✔పలుచోట్ల ఇఫ్తార్ విందు ✔టెన్త్ పరీక్షలు.. తనిఖీ చేసిన కలెక్టర్లు ✔CMను కలిసిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ✔వరల్డ్ వైడ్ కాంటెస్ట్లో గద్వాల ఇన్స్టా రీల్ ✔నాగర్కర్నూల్:Way2Newsతో చెంచులు ✔అయిజ: వేరుశనగతో వెళ్తున్న ఆటో బోల్తా ✔NGKL: ‘ఈనెల 26న వేసెక్టమి ఆపరేషన్లు’ ✔ఘనంగా ‘ప్రపంచ కవితా దినోత్సవం’ ✔NRPT: భార్యను చంపిన భర్త అరెస్ట్ ✔పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్