News December 2, 2025
జగిత్యాల: ‘ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగాలనే రాండమైజేషన్’

పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బంది 2వ రాండమైజేషన్ ప్రక్రియను కలెక్టర్ సత్యప్రసాద్ సోమవారం జగిత్యాల కలెక్టరేట్ లో జనరల్ అబ్జర్వర్ రమేష్ తో కలిసి నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగాలనే ఉద్దేశంతో రాండమైజేషన్ చేపట్టినట్లు పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలను ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నమన్నారు. అడిషనల్ కలెక్టర్ తదితరులున్నారు.
Similar News
News February 17, 2026
ఇక MPTC, ZPTC ఎన్నికలపై ఫోకస్!

TG: పంచాయతీ, మున్సిపల్ పోరు ముగియడంతో ఇక MPTC, ZPTC ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇవాళ అధికారులతో CM రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ తర్వాత పోల్స్పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకే విడతలో పోలింగ్ నిర్వహించాలని, 15-20 రోజుల్లో పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్, <<19148172>>ఇంటర్<<>>, టెన్త్ పరీక్షలకు తగ్గట్లుగా ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్నారు.
News February 17, 2026
ములుగు: బంపర్ ఆఫర్.. రెడీగా రూ.55 కోట్ల ఫండ్!

సాధారణంగా కొత్త పాలకవర్గాలకు సమస్యలు స్వాగతం పలుకుతాయి. కానీ, ములుగు మున్సిపల్ కార్యవర్గానికి సమస్యలతో పాటు నిధులు వెల్ కమ్ చెబుతున్నాయి. మంత్రి సీతక్క చొరవతో మేజర్ పంచాయతీ హోదాలో మున్సిపాలిటీ ఏర్పాటైన తర్వాత మొత్తం రూ.55 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ప్రతీ వార్డులో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి అనేక సమస్యలున్నాయి. వీటిని తీర్చుతూనే ముందుగా కోతుల సమస్యను పరిష్కరించాలని జనం కోరుతున్నారు.
News February 17, 2026
హార్దిక్ పాండ్య ‘రుద్ర’ వాచ్ గురించి తెలుసా?

శివరాత్రి రోజున <<19153355>>పాక్తో జరిగిన<<>> మ్యాచ్లో భారత ప్లేయర్ హార్దిక్ పాండ్య ధరించిన వాచ్పై నెట్టింట చర్చ జరుగుతోంది. జాకబ్ అండ్ కో సంస్థ ‘రుద్ర’ పేరుతో వీటిని తయారు చేస్తోంది. ఒక్కోటి రూ.25 లక్షల వరకు ఉంటుందని, ప్రపంచంలో 25 పీసులే ఉన్నాయని తెలుస్తోంది. వాచ్ డిస్ప్లేపై ధ్యానంలో ఉన్న శివుడు, ఓం, గుడి చిత్రాలున్నాయి. 41 MM గ్రేడ్ 5 టైటానియం కేస్తో ఇది తయారైంది. 70 గంటలపాటు పవర్ రిజర్వ్ ఉంటుంది.


