News February 6, 2025

జగిత్యాల: ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

image

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ బీ.ఎస్ లత బుధవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఉన్న ఫర్నిచర్, విద్యుత్తు ఏర్పాట్లు, నీటి వసతుల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట కోరుట్ల ఆర్డీఓ జీవాకర్ రెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గౌసూర్ రెహమాన్ ఉన్నారు.

Similar News

News January 16, 2026

లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

image

స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 234 పాయింట్లు పెరిగి 83,619 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 25,712 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్-30 సూచీలో ఇన్ఫీ, టెక్ మహీంద్రా, M&M, అదానీ పోర్ట్స్, ట్రెంట్ షేర్లు లాభాల్లో.. ఎటర్నల్, భారతీ ఎయిర్‌టెల్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.313 వద్ద ప్రారంభమైంది.

News January 16, 2026

కృష్ణా: ORR అభ్యంతరాలకు నేడే లాస్ట్ డేట్.. రైతుల్లో ఉత్కంఠ!

image

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ అభ్యంతరాల గడువు ఈ నెల 16వ తేదీతో ముగియనుంది. కృష్ణా జిల్లాలోని పామర్రు, పెనమలూరు, గన్నవరం పరిధిలో 189.4 కి.మీ మేర 6 వరుసల రహదారి కోసం కేంద్రం గెజిట్ విడుదల చేసింది. రూ. 16,310 కోట్ల భారీ వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టుపై రైతులు తమ అభ్యంతరాలను తెలిపేందుకు నేడే ఆఖరి అవకాశం.

News January 16, 2026

నేడు ఆవులను ఎలా పూజించాలంటే?

image

కనుమ రోజున ఆవులను, ఎడ్లను చెరువులు, బావుల వద్దకు తీసుకువెళ్లి శుభ్రంగా స్నానం చేయించాలి. ఆపై వాటి కొమ్ములకు రంగులు పూసి, మెడలో గంటలు, పూలమాలలు వేసి అందంగా అలంకరించాలి. నుదుటన పసుపు, కుంకుమలు పెట్టి హారతి ఇవ్వాలి. కొత్త బియ్యంతో వండిన పొంగలిని లేదా పచ్చగడ్డి, బెల్లం కలిపిన పదార్థాలను నైవేద్యంగా తినిపించాలి. చివరగా గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవడం ద్వారా ఆ దేవతల ఆశీస్సులు పొందవచ్చు.