News December 1, 2025
జగిత్యాల: గ్రీవెన్స్ డేలో అర్జీదారులకు భరోసా ఇచ్చిన ఎస్పీ

ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా ఈ రోజు జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో అశోక్ కుమార్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 5మంది అర్జీదారుల ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు పోలీస్ శాఖను చేరువ చేస్తూ, ఫిర్యాదులపై వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరుగునట్లు చూడాలని తెలిపారు.
Similar News
News February 13, 2026
జగిత్యాల జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన కౌంటింగ్

జగిత్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. 5 మున్సిపాలిటీల కౌంటింగ్ కోసం 46 టేబుల్స్, 46మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 135 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 46 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించి మొత్తంగా 3 రౌండ్లలో కౌంటింగ్ ను సాయంత్రం 6 గంటల్లోపు పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. కౌంటింగ్ ప్రశాంతంగా జరగడానికి సహకరించిన ప్రతిఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
News February 13, 2026
సిబ్బందికి శుభాకాంక్షలు: ఆదిలాబాద్ కలెక్టర్

జిల్లాలో మున్సిపల్ కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కౌంటింగ్ విధుల్లో పాల్గొన్న సిబ్బంది క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేసి మొత్తం ప్రక్రియను సాఫీగా పూర్తి చేశారని ఆయన అభినందించారు. మద్దతు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కౌంటింగ్లో పాల్గొన్న సిబ్బంది, భద్రతా సిబ్బంది, సంబంధిత అధికారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
News February 13, 2026
దేశవ్యాప్తంగా సిట్టింగ్ జడ్జిలపై 8,630 ఫిర్యాదులు

గత దశాబ్ద కాలంలో సిట్టింగ్ జడ్జిలపై భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయానికి 8,630 ఫిర్యాదులు వచ్చాయని కేంద్రం ఇవాళ లోక్సభలో వెల్లడించింది. ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. 2024లో మాజీ CJI చంద్రచూడ్, మాజీ CJI సంజీవ్ ఖన్నా పదవీ కాలంలో ఎక్కువ ఫిర్యాదులు నమోదయ్యాయని తెలిపింది. పదేళ్ల గణాంకాలు చూస్తే ఎక్కువగా 2022లో 1,012, 2023లో 977, 2024లో 1,170, 2025లో 1,102 ఫిర్యాదులు నమోదయ్యాయంది.


