News March 26, 2024

జగిత్యాల: చికిత్స పొందుతూ మహిళ మృతి

image

జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేటలో సోమవారం హోలీ సందర్భంగా రెండు కుటుంబాల మధ్య జరిగిన <<12927777>>ఘర్షణ<<>> ఓ మహిళ ప్రాణాలను బలి తీసుకుంది. ప్రకాష్ అనే యువకుడు హోలీ ఆడుతుండగా పక్కింటి పైకి గుడ్డు విసిరాడు. దీంతో పక్కింటి రిషి, ఆయన తల్లి రమ అడగడంతో ప్రకాష్ కొడవలితో దాడిచేయగా రమకు తీవ్రగాయాలయ్యాయి. కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, మంగళవారం ఉదయం మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News February 10, 2026

కరీంనగర్‌లో 23 ప్రత్యేక బృందాలతో నిఘా

image

ఎన్నికల్లో నగదు, మద్యం పంపిణీని అరికట్టేందుకు 23 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు. ఈ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయన్నారు. ఎన్నికల ఉల్లంఘనలపై ప్రజలు 87126 70744, 87126 70745 నంబర్లకు లేదా డయల్ 100కు ఫిర్యాదు చేయాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

News February 10, 2026

1300 మందితో బందోబస్తు: కరీంనగర్ సీపీ

image

కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు 1300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్ సహా హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండిలో నిఘా పెంచామన్నారు. సున్నిత కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 10, 2026

కరీంనగర్ జిల్లాలో 189 మంది బైండోవర్: సీపీ గౌష్ ఆలం

image

మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ కఠినమైన ముందస్తు చర్యలు చేపట్టింది. కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే 189 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేయడంతో పాటు, 49 లైసెన్స్ ఆయుధాలను డిపాజిట్ చేయించినట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. నిబంధనల ఉల్లంఘనపై ఇప్పటివరకు 13 కేసులు నమోదు చేశామని, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలతో నిరంతరం నిఘా కొనసాగుతోందని ఆయన వెల్లడించారు.