News May 13, 2024

జగిత్యాల: తల్లి మృతి.. దుఃఖంలోనూ ఓటేశారు!

image

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన తోకల గంగాధర్ తల్లి మల్లు అనారోగ్యంతో మృతి చెందారు. పుట్టెడు దుఃఖంలో ఉన్నా ఓటు హక్కును గంగాధర్‌తో పాటు ఆయన భార్య ప్రవళిక వినియోగించుకున్నారు. ఓటు వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గంగాధర్ అన్నారు.

Similar News

News December 14, 2025

రామకృష్ణ కాలనీ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

image

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రామ కృష్ణ కాలనీ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశించారు. పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ పర్సంటేజ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఇక్కడ జిల్లా అధికారులు, మండల అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

News December 14, 2025

కరీంనగర్ జిల్లాలో 111 గ్రామాల్లో పోలింగ్

image

కరీంనగర్ జిల్లాలో నేడు రెండవ దశ గ్రామపంచాయతీ ఎన్నికలు.మానకొండూర్ నియోజకవర్గంలోని 113 గ్రామాలకు గాను రెండు ఏకగ్రీవం కాగా, 111 గ్రామాలకు పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 1046 వార్డుల్లో 197 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 849 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ బరిలో 436 మంది, వార్డు సభ్యులుగా 2275 మంది ఉన్నారు. 1,84,761 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

News December 13, 2025

రెండో దశ ఎన్నికలు జరిగే ప్రాంతాలను పరిశీలించిన KNR సీపీ

image

కరీంనగర్ జిల్లాలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచామని, అన్ని పోలింగ్ కేంద్రాలను సీసీ టీవీ కెమెరాలు, వీడియో రికార్డింగ్ ద్వారా పర్యవేక్షించనున్నట్లు ఆయన తెలిపారు.