News May 7, 2025
జగిత్యాల: ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన

బీర్పూర్ మండలం మోతీ నగర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ శుక్రవారం పరిశీలించారు. నాణ్యమైన ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. కేంద్రాలలో తాగునీటి వసతి, టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.
Similar News
News February 15, 2026
యనమలకుదురులో ఐజీపీ తనిఖీలు

మహాశివరాత్రి పురస్కరించుకొని యనమలకుదురులో భద్రతా ఏర్పాట్లను ఏలూరు రేంజ్ ఐజీపీ జీ.వీ.జీ. అశోక్ కుమార్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పండుగను భక్తులు ప్రశాంతంగా జరుపుకొనేలా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రభల ఊరేగింపు, భక్తుల రద్దీని అంచనా వేసి తగిన ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు.
News February 15, 2026
TODAY HEADLINES

* రూ.3.32 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్
* రూ.57,868 కోట్లతో అమరావతి పనులు: పయ్యావుల
* బిల్ గేట్స్ను 3సార్లు APకి తీసుకొచ్చింది నేనే: CBN
* బడ్జెట్ ప్రసంగంలో భజనే ఉంది: బొత్స
* దేశాన్ని కాంగ్రెస్ అవమానిస్తోంది: మోదీ
* USతో డీల్.. ‘టెక్స్టైల్’కు ఉరితాడు: రాహుల్
* ‘మున్సిపల్’ స్ఫూర్తితో ముందుకెళ్లాలి: రేవంత్
* TG: 17న ‘రైతు భరోసా’?
* TG: కొత్తగూడెం కార్పొరేషన్.. CPI, కాంగ్రెస్ పొత్తు
News February 15, 2026
రేపు పాక్పై అభిషేక్ సునామీ!

T20WC: భారత కెప్టెన్ <<19142443>>సూర్య<<>> మాటలతో విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ రేపు పాక్పై ఆడటం ఖాయమైంది. అటు గంభీర్ పర్యవేక్షణలో ఇవాళ అతను ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు సైతం బయటికొచ్చాయి. ఇప్పటి వరకు అభిషేక్ పాక్పై ఆడిన 3 మ్యాచుల్లోనూ అదరగొట్టారు. 190 స్ట్రైక్రేట్తో 110 రన్స్ చేశారు. రేపటి మ్యాచులోనూ చెలరేగి భారత్కు శుభారంభం అందించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. అటు అభిషేక్ ఆడనున్న నేపథ్యంలో సంజూపై వేటు పడనుంది.


