News August 11, 2025
జగిత్యాల: ప్రతి రైతుకు యూరియా అందిస్తాం: మంత్రి

ప్రతి రైతుకు సరిపడ యూరియా అందిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం వ్యవసాయ శాఖ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, నీటిపారుదల శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చైనా నుంచి ముడిసరకు దిగుమతి కొంత ఆలస్యం కావడం వల్ల సమస్య ఏర్పడుతోందని కేంద్రమంత్రి చెప్పారన్నారు. రైతులకు యూరియాలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకునే బాధ్యత ప్రభుత్వానిదన్నారు.
Similar News
News March 12, 2026
ADB: ఉచిత శిక్షణ.. APPLY NOW

టాస్క్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. సీ, జావా, పైథాన్, వెబ్ డెవలప్మెంట్, సాఫ్ట్ స్కిల్స్లో శిక్షణ ఇవ్వనున్నారు. గ్రాడ్యుయేట్లు, ఫైనలియర్ విద్యార్థులు అర్హులు. మార్చి 16లోగా ఆధార్, పాన్ కార్డ్, సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు 9502786438 నంబర్ను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు.
News March 12, 2026
MBNR: “కురుమూర్తి కొండలను కాపాడండి”

చిన్నచింతకుంట మండలం అమ్మాపురం సమీపంలోని శ్రీశ్రీశ్రీ కురుమూర్తి స్వామి దేవాలయ కొండల వద్ద క్వారీ అనుమతులపై భక్తులు, హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అధికారులు ప్రజాభిప్రాయ సేకరణకు ప్రయత్నించడాన్ని నిరసిస్తూ మార్చి 14న ఉదయం 10 గంటలకు నిరసన దీక్ష చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 1000 చరిత్ర కలిగిన కురుమూర్తి కొండలను కాపాడాలని వారు డిమాండ్ చేశారు.
News March 12, 2026
సిరిసిల్ల: ఇంటర్ పరీక్షలకు 131 మంది గైర్హాజరు

సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా గురువారం నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని 16 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 4,295 మంది విద్యార్థులకు గాను 4,164 మంది హాజరయ్యారు. వివిధ కారణాలతో 131 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. పరీక్ష కేంద్రాల్లో ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని అధికారులు స్పష్టం చేశారు.


