News February 17, 2025
జగిత్యాల: యువకుడి ఆత్మహత్య

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన యువకుడు మంతెన ప్రవీణ్(19) సోమవారం సాయంత్రం తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. కుటుంబ సభ్యులు వ్యవసాయ పనుల నిమిత్తం బయటకు వెళ్లారని, ప్రవీణ్ ఒక్కడే ఇంటి వద్ద ఉన్నాడని చెప్పారు. ఈ క్రమంలో ప్రవీణ్ సూసైడ్ చేసుకున్నాడని తెలిపారు. అతడి ఆత్మహత్యకు గల కారణం తెలియాల్సి ఉందన్నారు. పోలీసులు వచ్చి వివరాలు సేకరిస్తున్నారు.
Similar News
News April 14, 2026
GNT: ఆంధ్రప్రదేశ్ పోలీసులకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ పోలీసులకు డీజీపీ కార్యాలయం శుభవార్త చెప్పింది. వారి సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పోలీసు సిబ్బందికి పుట్టినరోజు, పెళ్లిరోజు నాడు కచ్చితంగా సెలవు మంజూరు చేయనున్నారు. సిబ్బంది తమ కుటుంబాలతో ఈ వేడుకలు జరుపుకునేలా ఈ అవకాశం కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో మినహా సిబ్బందికి కచ్చితంగా సెలవులు ఇవ్వాలని యూనిట్ అధికారులకు డీజీపీ సర్క్యులర్ జారీ చేశారు.
News April 14, 2026
1,000 లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ ఉద్యోగాలు

పంజాబ్&సింధ్ బ్యాంకులో 1,000 లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. TGలో 30 పోస్టులున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణత, ఏదైనా బ్యాంకులో 18 నెలల పని అనుభవం ఉండాలి. సంబంధిత రాష్ట్రంలోని లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. వయసు 20-30 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ APR 20. మరిన్ని వివరాలకు punjabandsind.bank.in చూడండి.
News April 14, 2026
HYD: BJPకి క్రైస్తవుల మద్దతు: TG చీఫ్

భిన్నత్వంలో ఏకత్వానికి, సర్వమత సామరస్యానికి భారతదేశం గొప్ప ప్రతీక అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. HYDలో క్రైస్తవులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ అభివృద్ధి అజెండాను విశ్వసిస్తూ కేరళం, గోవా లాంటి రాష్ట్రాల్లో క్రైస్తవ సమాజం పెద్ద ఎత్తున బీజేపీకి మద్దతు తెలుపుతుండటం హర్షణీయమన్నారు.


