News December 1, 2025
జగిత్యాల: రూ.28 లక్షల విలువైన 136 మొబైల్స్ రికవరీ

పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా సులభంగా తిరిగి పొందవచ్చని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో రూ.28 లక్షల విలువగల 136 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. CEIRలో IMEI వివరాలు నమోదు చేస్తే ఫోన్లను త్వరగా ట్రేస్ చేయవచ్చని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో రూ.3.5 కోట్ల విలువగల 1548 ఫోన్లు రికవరీ చేసినట్లు వెల్లడించారు.
Similar News
News February 7, 2026
నిర్మల్: అంతా వారి డైరెక్షన్లోనే ప్రచారం..!

ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. BRS, BJP, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అన్ని వార్డుల్లో అభ్యర్థులను గెలిపించేందుకు ఆరాటపడుతున్నారు. ఇందుకోసం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రధాన పార్టీలు ఇప్పటికే ఆయా వార్డుల్లో అభ్యర్థులకు ఇన్ఛార్జ్లను కేటాయించారు. ఎప్పటికప్పుడు ప్రచార శైలిని, ఓటరు నాడిని పరిశీలిస్తూ ముందుకు నడిపిస్తున్నారు.
News February 7, 2026
ఆన్లైన్ బెట్టింగ్లకు దూరంగా ఉండాలి: ఎస్పీ జానకి షర్మిల

పోలీసులు ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు. ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో జరిగిన వీక్లీ పరేడ్లో మాట్లాడారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి శాఖ ప్రతిష్ఠను కాపాడాలన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ కుటుంబంతో గడపాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
News February 7, 2026
ఆరోగ్యంగా ఉంటేనే విధుల్లో రాణించగలరు: ఎస్పీ

పోలీసులకు విధి నిర్వహణ ఎంత ముఖ్యమో ఆరోగ్య పరిరక్షణ, క్రమశిక్షణ, ఫిట్నెస్ కూడా అంతే ముఖ్యమని ఎస్పీ అన్నారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో జరిగిన వీక్లీ పరేడ్లో మాట్లాడారు. సిబ్బంది సమయం దొరికినప్పుడు వ్యాయామం చేయాలని, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోవాలన్నారు. ఫిట్నెస్తోనే సమర్థవంతంగా విధులు నిర్వహించగలమని, మంచి జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.


