News September 13, 2025

జగిత్యాల: రైతుల భూవివాదం కలెక్టరేట్‌లో విచారణ

image

కొడిమ్యాల్ మండలం గౌరాపూర్‌కు చెందిన చింతపంటి నారాయణ(70)తోపాటు మరో ఆరుగురు భూస్వాములు తమ భూములు జాతీయ రహదారి-563 నాలుగు లేన్ల విస్తరణలో రావడం వల్ల ప్రభావితమవుతున్నాయని, భూ స్వాధీనంపై కలెక్టరేట్ ఆదేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆర్బిట్రేషన్ కింద అప్పీలు చేశారు. కలెక్టర్, ఆర్బిట్రేటర్ సత్య ప్రసాద్ కలెక్టరేట్‌లో వాదనలు విని, పిటిషనర్లు సమర్పించిన ఆధారాలను పరిశీలించి, మరో వారం గడువు ఇచ్చారు.

Similar News

News December 13, 2025

KMR: రెండవ విడత 1,89,177 ఓటర్లు

image

కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, గాంధారి, మహమ్మద్ నగర్, నిజాంసాగర్, పిట్లం మండలాల్లో రేపు రెండవ విడత పోలింగ్ జరగనుంది. మొత్తం 1,89,177 మంది ఓటర్లుండగా, మహిళలు 98,435, పురుషులు 90739, ఇతరులు 3 ఉన్నారు. 1655 పోలింగ్ కేంద్రాల్లో 153 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలను అధికారులు నిర్వహించనున్నారు. 197 గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే 44 సర్పంచ్, 775 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.

News December 13, 2025

GNT: ఇం’గలీస్’ టీచర్.. 8వ తరగతి విద్యార్థినిని ట్రాప్ చేసి..

image

పాఠాలు చెప్పాల్సిన పంతులు.. పెడదారి పట్టాడు. 45 ఏళ్ళ వయస్సులో ప్రేమ పేరుతో 8వ తరగతి విద్యార్థినిని లోబర్చుకున్నాడు. గుజ్జనగుండ్లకు చెందిన కార్తీక్ పేరేచర్లలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్. ఓ విద్యార్థినికి మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకొచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ ఘటన తర్వాత బాలిక మేడికొండూరు PSకి వెళ్ళి సార్‌ తనను పెళ్ళి చేసుకున్నారని.. ఆయతోనే ఉంటానని అనడంతో పంచాయితీ జరుగుతోంది.

News December 13, 2025

‘కాకినాడ కాదని.. దూరంలోని అమలాపురం ఎందుకు?’

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని RCPM, మండపేటలను కాకినాడ లేదా తూ.గోలో కలపాలన్న డిమాండ్‌ తీవ్రరూపు దాలుస్తోంది. కాకినాడ కంటే జిల్లా కేంద్రం అమలాపురం దూరం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండపేట విలీనం జరిగినా పాలనాపరమైన ఇక్కట్లు తప్పలేదని ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ సమస్య పరిష్కారంలో మంత్రి సుభాష్‌ విఫలమయ్యారని, ప్రజాభీష్టాన్ని విస్మరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.