News November 19, 2025

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో ధరలిలా

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.2,116, కనిష్ఠ ధర రూ.1,827, వరి ధాన్యం(1010) గరిష్ఠ ధర రూ.2,121, కనిష్ఠ ధర రూ.1,900, వరి ధాన్యం(HMT) గరిష్ఠ ధర రూ.2,200, కనిష్ఠ ధర రూ.2,150, వరి ధాన్యం(JSR) గరిష్ఠ ధర రూ.2,891, కనిష్ఠ ధర రూ.2,081గా పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు.

Similar News

News January 13, 2026

SBI ఖాతాదారులకు అలర్ట్

image

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇతర బ్యాంక్ ATMల్లో ఫ్రీ ట్రాన్సాక్షన్లు సంఖ్య (నెలకు 5) కంటే ఎక్కువగా ఉపయోగిస్తే ప్రతి విత్ డ్రాకు రూ.23+జీఎస్టీ వసూలు చేయనుంది. ఇక బ్యాలెన్స్ చెక్ చేసినా, మినీ స్టేట్‌మెంట్‌ తీసినా రూ.11 కట్ కానున్నాయి. శాలరీ ఖాతాదారులు నెలకు 10 లావాదేవీల వరకు ఉచితం. పెరిగిన ఛార్జీలు 2025 డిసెంబర్ నుంచే అమలులోకి వచ్చినట్లు పేర్కొంది.

News January 13, 2026

నేటి నుంచి జిల్లావ్యాప్తంగా ‘అరైవ్ అలైవ్’: కామారెడ్డి ఎస్పీ

image

రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నేటి నుంచి ప్రారంభమయ్యే ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లాలో విజయవంతం చేయాలని SP రాజేష్ చంద్ర అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూనే, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళా భద్రత, సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

News January 13, 2026

15 నుంచి గ్రామ స్థాయిలో ఉపాధిహామీ పథకం సోషల్ ఆడిట్

image

రామభద్రపురం మండలంలో 2024-25 సంవత్సరానికి సంబంధించి 22 గ్రామ పంచాయతీల్లో ఉపాధిహామీ పథకం సోషల్ ఆడిట్ పారదర్శకంగా నిర్వహించాలని స్టేట్ రిసోర్సుపర్సన్ గోవింద్ కోరారు. ఉపాధిహామీ పథక కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. ఈ నెల 15 నుంచి గ్రామ స్థాయిలో ఉపాధి పనులు, సామాజిక భద్రతా పింఛన్లపై తనిఖీలు నిర్వహిస్తామన్నారు. సుమారు రూ.16.50 కోట్ల విలువచేసే పనులపై ఈ
సోషల్ ఆడిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు.