News November 17, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> నిడిగొండలో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి
> కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
> మెరుగైన వైద్య సేవలు అందించాలి పాలకుర్తి ఎమ్మెల్యే
> దొడ్డి కొమురయ్య త్యాగం మరువలేనిది ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
> ఆర్ఎంపి, పిఎంపి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి
> చిట్టితల్లిని ఎత్తుకొని లాలించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
Similar News
News January 24, 2026
VJA: ఇన్స్టాగ్రామ్లో ప్రేమ.. బాలుడి ఇంటికి వెళ్లిన బాలిక

సోషల్ మీడియా పరిచయాలు యువతను పెడదారి పట్టిస్తున్నాయి. ప్రసాదంపాడుకు చెందిన ఓ బాలికను ఈ నెల 21న తల్లి మందలించడంతో, ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన పామర్రుకు చెందిన బాలుడి ఇంటికి వెళ్లిపోయింది. అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నానని చెప్పి నేరుగా బాలుడి వద్దకు వెళ్లడంతో అతని కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. బాధ్యతగా వ్యవహరించిన బాలుడి కుటుంబీకులు వెంటనే బాలికను పటమట పోలీసులకు అప్పగించారు.
News January 24, 2026
బిడ్డను నరబలి ఇచ్చిన తల్లికి ఉరిశిక్ష రద్దు!

TG: 2021లో సూర్యాపేట జిల్లాలో మూఢనమ్మకంతో 7 నెలల పసికందును నరబలి ఇచ్చిన కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితురాలు బానోత్ భారతికి దిగువ కోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేసింది. ఘటన సమయంలో భారతి తీవ్రమైన మానసిక అనారోగ్యంతో ఉందని, ఏం చేస్తుందో కూడా తెలియని స్థితిలో ఉన్నందున నేరం వర్తించదని స్పష్టం చేసింది. ఆమెను తక్షణమే మానసిక చికిత్స కేంద్రానికి తరలించాలని ఆదేశించింది.
News January 24, 2026
నిర్మల్: డీలర్ వద్దే వాహన రిజిస్ట్రేషన్

వ్యక్తిగత వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం కీలక మార్పు తెచ్చింది. శనివారం (జనవరి 24) నుంచి కొనుగోలు చేసే వాహనాలకు డీలర్ పాయింట్ వద్దే రిజిస్ట్రేషన్ జరుగుతుందని రవాణా శాఖ అధికారులు దుర్గాప్రసాద్, మహేందర్ తెలిపారు. వాహనదారులు ఇకపై ఆర్టీఓ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని, షోరూమ్లోనే ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు. దీనివల్ల సమయం, శ్రమ ఆదా అవుతుందన్నారు.


