News March 13, 2025
జనగామ: ‘రాజకీయ ప్రతినిధులతో సమావేశాలను పూర్తి చేయాలి’

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాల నిర్వహణపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జనగామ జిల్లా నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. మార్చి 19లోపు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలను పూర్తి చేయాలని సూచించారు.
Similar News
News February 18, 2026
జపం ఎక్కడ చేస్తే ఉత్తమ ఫలితాలు?

జపం చేసే స్థలం, ఆసనాన్ని బట్టి ఫలితం మారుతుందని శాస్త్ర వచనం. వాటి ప్రకారం.. ఉన్ని వస్త్రంపై జపం వంశవృద్ధిని, పర్వత శిఖరంపై జపం తపస్సిద్ధిని కలిగిస్తాయి. ఇంట్లో చేసే జపం సాధారణ ఫలితం, నదీ తీరంలో చేస్తే అంతకన్నా 2 రెట్లు, గోశాలలో 100 రెట్లు పుణ్యం లభిస్తుంది. తిరుమల, కాశీ, శ్రీశైలం వంటి స్వయంభూ క్షేత్రాల్లో చేసే జపానికి కోటి రెట్ల ఫలితం ఉంటుంది. సూర్యుడు, గురువు, దీపానికి అభిముఖంగా జపం చేయాలి.
News February 18, 2026
సోనియా నన్ను CM చేయాలనుకున్నారు.. కానీ: హిమంత

2014లో తనను అస్సాం CM చేయాలని నాటి కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ అనుకున్నారని హిమంత బిశ్వ శర్మ చెప్పారు. కానీ రాహుల్ వల్ల మొత్తం మారిపోయిందన్నారు. ‘తేదీ నిర్ణయించుకోమని మేడమ్(సోనియా) చెప్పారు. జూన్లో ప్రమాణ స్వీకారం చేస్తానన్నా. USలో ఉన్న రాహుల్ పార్టీ నాయకులతో ఫోన్లో మాట్లాడిన తర్వాత పరిస్థితి మారిపోయింది’ అని ఆరోపించారు. 2015 ఆగస్టులో కాంగ్రెస్ నుంచి BJPలోకి ఆయన చేరారు. 2021లో CM అయ్యారు.
News February 18, 2026
కర్నూలు: ఒక్క నిమిషం ఆలస్యమైనా..

కర్నూలు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో రికార్డు అసిస్టెంట్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నేడు రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు సంస్థ కార్యదర్శి లీలా వెంకటేశ్ శేషాద్రి తెలిపారు. అభ్యర్థులు నిర్దేశించిన సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. గేట్ క్లోజర్ సమయం తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎవరినీ లోపలికి అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు.


