News November 5, 2025
జనగామ: సీసీఐ కొర్రీలు.. దళారుల దండు!

జిల్లాలో క్వింటాకు ₹8,100 మద్దతు ధరకు సీసీఐ పత్తి కొనుగోళ్లు ప్రారంభించినా, రైతులకు కొర్రీలు ఎదురవుతున్నాయి. స్లాట్ బుక్ చేసుకుని పత్తి తెస్తే.. కాయలు, తేమ ఎక్కువ ఉన్నాయని తిరస్కరిస్తున్నారు. దీంతో చేసేది లేక పురుగులు, వర్షాలతో ఇప్పటికే నష్టపోయిన రైతులు, దళారుల పాలు అవుతున్నారు. వారు ₹5,000కే ప్రైవేటుగా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆంక్షలు లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
Similar News
News January 19, 2026
HYD: రికార్డుల్లో లేని నాలా.. రియల్టర్లకు నోట్ల మాలా..!

నగర శివార్లలో నాలాల విస్తరణకు కూడా 400% TDR ఇస్తామన్న కొత్త GO అక్రమార్కులకు వరంగా మారనుంది. రెవెన్యూ రికార్డుల్లో లేని కాలువలనూ పరిగణనలోకి తీసుకోవచ్చన్న వెసులుబాటును అడ్డం పెట్టుకుని కొందరు బడా రియల్టర్లు తమ వెంచర్ల మధ్యలో పనికిరాని గుంటలను నాలాగా చూపించుకోవచ్చు. అధికారులతో కుమ్మక్కై రూ.కోట్లు విలువైన TDR సర్టిఫికెట్లు పొందేందుకు స్కెచ్ వేశారని విశ్లేషకుల అంచనా. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి.
News January 19, 2026
HYD: రికార్డుల్లో లేని నాలా.. రియల్టర్లకు నోట్ల మాలా..!

నగర శివార్లలో నాలాల విస్తరణకు కూడా 400% TDR ఇస్తామన్న కొత్త GO అక్రమార్కులకు వరంగా మారనుంది. రెవెన్యూ రికార్డుల్లో లేని కాలువలనూ పరిగణనలోకి తీసుకోవచ్చన్న వెసులుబాటును అడ్డం పెట్టుకుని కొందరు బడా రియల్టర్లు తమ వెంచర్ల మధ్యలో పనికిరాని గుంటలను నాలాగా చూపించుకోవచ్చు. అధికారులతో కుమ్మక్కై రూ.కోట్లు విలువైన TDR సర్టిఫికెట్లు పొందేందుకు స్కెచ్ వేశారని విశ్లేషకుల అంచనా. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి.
News January 19, 2026
సంగారెడ్డి: నేటి నుంచి కొత్త సర్పంచ్లకు శిక్షణ

జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు 19 నుంచి మార్చి 8 వరకు విడుతల వారీగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య ఆదివారం తెలిపారు. బైపాస్ రహదారిలోని దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళా శిశు వికాస కేంద్రంలో శిక్షణ తరగతులు జరుగుతాయని చెప్పారు. బ్యాచ్కు 100 మంది చొప్పున మొత్తం ఆరు బ్యాచ్లో శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు.


