News January 21, 2026

జనవరి 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’

image

AP: పర్యాటక శాఖ JAN 24-FEB 1 వరకు ‘విశాఖ ఉత్సవం’ నిర్వహించనుంది. ‘సీ టు స్కై’ కాన్సెప్ట్‌తో విశాఖ, అనకాపల్లి, అరకు లోయలో 9 రోజులపాటు ఉత్సవం జరగనుంది. విశాఖలో JAN 24-31 వరకు, JAN 29, 30 అనకాపల్లిలో, JAN 30-FEB 1 వరకు అరకు లోయలో ఈ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. దీనిలో 10 లక్షల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. 3000 మందికి ప్రత్యక్ష, 1800 మంది సహాయకులకు ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు.

Similar News

News February 18, 2026

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌(HPCL) ఇంజినీర్, Jr. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, తదితర పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు FEB 25 నుంచి మార్చి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష(CBT), గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. త్వరలో పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల కానుంది. వెబ్‌సైట్: https://www.hindustanpetroleum.com/

News February 18, 2026

PPP మోడల్‌లో వంద పడకల ఆస్పత్రులు: మంత్రి సత్యకుమార్‌

image

AP: ప్రతి ఒక్కరి ప్రాణం విలువైనదని భావించే కూటమి ప్రభుత్వం వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తోందని మంత్రి సత్యకుమార్ అసెంబ్లీలో ప్రకటించారు. ఆళ్లగడ్డ, కొవ్వూరు వంటి ప్రాంతాల్లో ఆస్పత్రుల సామర్థ్యం పెంచాలన్న సభ్యుల విజ్ఞప్తిపై స్పందిస్తూ.. 50 పడకల కన్నా తక్కువ సౌకర్యాలున్న 61 నియోజకవర్గాలను గుర్తించామన్నారు. మొదట PPP మోడల్‌లో అక్కడ 100 పడకల మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తామన్నారు.

News February 18, 2026

చంద్రబాబు వదిలిపెట్టరనే భయంతోనే ఆత్మహత్యలు: TDP

image

AP: మదనపల్లెలో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో SMలో TDP ఆసక్తికర పోస్ట్ పెట్టింది. 2018 దాచేపల్లి నుంచి నేటి మదనపల్లె ఘటన వరకు ఆడబిడ్డల జోలికి వెళ్లిన నిందితులు వరుసగా ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొంది. నేరం చేస్తే చంద్రబాబు వదిలిపెట్టరనే భయమే వారిని వెంటాడిందని, అందుకే ప్రాణాలు తీసుకున్నారని రాసుకొచ్చింది.