News April 14, 2024
జన్నారంలో విద్యుత్ షాక్తో యువకుడి మృతి

జన్నారం మండలంలోని బాదంపల్లి గోదావరి తీరంలో మోటార్ రిపేర్ చేస్తుండగా ఓ యువకుడు మృతి చెందాడు. ఇప్పలపల్లి గ్రామానికి చెందిన రాజేశ్ గోదావరి తీరంలో మోటార్ రిపేర్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. రాజేశ్ మండలంలో వైండింగ్ పనులు చేస్తూ జీవించేవాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
Similar News
News December 14, 2025
ఆదిలాబాద్ జిల్లాలో తొలి ఫలితం

సాత్నాల మండలంలోని సాంగ్వి (జి) గ్రామ పంచాయతీ సర్పంచ్గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఆత్రం నగేశ్ గెలుపొందారు. ప్రత్యర్థిపై 389 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సర్పంచ్ నగేశ్ను పలువురు అభినందించారు.
News December 14, 2025
83.80 శాతం పోలింగ్ నమోదు

జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. 8 మండలాల్లో 139 పంచాయతీల్లో ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. పోలింగ్ సమయం ఒంటి గంట ముగిసే సరికి 83.80 శాతం పోలింగ్ నమోదు అయిందని అధికార వర్గాలు వెల్లడించారు. ఆయా మండలాల్లో ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచారు.
News December 14, 2025
సెల్ఫీ పాయింట్ వద్ద ఫొటో దిగిన ADB కలెక్టర్

జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేలా పలు మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మావల మోడల్ పోలింగ్ కేంద్రం వద్ద సెల్ఫీ పాయింట్లు అందంగా తయారు చేశారు. కేంద్రం పరిశీలనకు వచ్చిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఓటర్లతో కలిసి సెల్ఫీ పాయింట్ వద్ద ఫొటోలు దిగారు.


