News December 2, 2025
జపం చేసేటప్పుడు మధ్య వేలును ఎందుకు ఉపయోగిస్తారు?

యోగ శాస్త్రం ప్రకారం.. మధ్య వేలు నుంచి ఓ ముఖ్యమైన ప్రాణశక్తి ప్రవహిస్తుంది. జపం చేసేటప్పుడు ఈ వేలిని ఉపయోగించడం వలన మనస్సు శుద్ధి జరిగి, నాడీ వ్యవస్థ బలపడుతుంది. దీనికి మంత్ర శక్తి తోడై కుండలినీ శక్తి జాగృతం అవుతుంది. దీని ప్రభావం మనసు చంచల స్వభావాన్ని నియంత్రిస్తుంది. అలాగే మనిషిని అంతరాత్మతో అనుసంధానం చేస్తుంది. ఫలితంగా, ఆధ్యాత్మిక బంధం బలపడుతుంది. భగవంతుని అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి.
Similar News
News February 19, 2026
ఇండియాలోనూ ఇలాంటి మార్పులు కావాలా?

ఇండియాలోనూ జపాన్ తరహా మార్పులు రావాలని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మన దగ్గర పిల్లలు ఫాస్ట్ ఫుడ్, ప్యాక్ చేసిన స్నాక్స్కు అలవాటు పడ్డారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది చిన్న వయసులోనే ఊబకాయం, మధుమేహం వంటి ముప్పుకు దారితీస్తోందని హెచ్చరిస్తున్నారు. దీనిని అరికట్టేందుకు జపాన్లోని పాఠశాల క్యాంటీన్లలో ప్రాసెస్డ్, అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ను నిషేధించినట్లు తెలిపారు. దీనిపై మీ కామెంట్?
News February 19, 2026
వంటింటి చిట్కాలు మీ కోసం

* కూరగాయలు వడలిపోయినట్టు అయితే, నీటిలో వేసి నిమ్మరసం పిండితే కాసేపటికి తాజాగా మారతాయి. * వంటకాల్లో ఉల్లివాసన ఎక్కువగా రాకుండా ఉండాలంటే వాటిని వేయించే ముందు కొద్దిగా పంచదార వేయాలి. * పూరీలు మృదువుగా రావాలంటే పిండిని వేడి నీళ్ళూ, పాలతో కలిపి అరగంట సేపు రుమాలులో చుట్టి ఉంచాలి. * పెరుగు త్వరగా పులవకుండా ఉండాలంటే, తోడుకున్నాక దానిపై ఒకటి రెండు చిన్న కొబ్బరి ముక్కల్ని ఉంచండి.
News February 19, 2026
గర్ల్ఫ్రెండ్తో పూల్లో హార్దిక్ పాండ్య.. ఫొటో వైరల్

తన గర్ల్ఫ్రెండ్ మహీకా శర్మకు బర్త్డే విషెస్ చెబుతూ క్రికెటర్ హార్దిక్ పాండ్య పోస్ట్ చేసిన ఫొటో వైరలవుతోంది. స్విమ్మింగ్ పూల్లో ఆమెతో క్లోజ్గా ఉన్న ఫొటోను హార్దిక్ ఇన్స్టాలో షేర్ చేశారు. ‘హ్యాపీ బర్త్డే మై ప్రిన్సెస్’ అని పేర్కొన్నారు. కాగా గత ఏడాది OCTలో మహీకాతో రిలేషన్షిప్ను హార్దిక్ కన్ఫర్మ్ చేశారు. అప్పటి నుంచి ఆమెతో కలిసి తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.


