News November 19, 2025

జమ్మలమడుగు వైసీపీ ఇన్‌‌ఛార్జ్‌గా రామసుబ్బారెడ్డి

image

జమ్మలమడుగు YCP ఇన్‌ఛార్జ్‌ విషయంలో పార్టీ అధిష్ఠానం కీలక ప్రకటన చేసింది. MLC రామసుబ్బారెడ్డికే ఇన్‌ఛార్జ్ పదవి బాధ్యతలు ఇస్తూ పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు మాజీ MLA సుధీర్ రెడ్డికి 3 మండలాలు, రామసుబ్బారెడ్డికి 3 మండలాలు అప్పగించింది. జగన్ సమక్షంలో జరిగిన ఈ పంచాయితీలో రామసుబ్బారెడ్డికే ఖరారు చేసింది. సుధీర్ రెడ్డికి సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్‌ పదవి ఇచ్చింది.

Similar News

News January 17, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు..

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారం, వెండి ధరల వివరాలు.
* బంగారం 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.14,330
* బంగారం 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.13,184
* వెండి 10 గ్రాములు ధర రూ.2,810

News January 17, 2026

కడప: నదిలో మృతదేహం కలకలం

image

కడప జిల్లా పెద్ద జొన్నవరం గ్రామానికి చెందిన వృద్ధురాలి మృతదేహం నంద్యాల జిల్లాలోని కుందూ నదిలో లభ్యమైంది. శూలం లక్ష్మీదేవి తరచుగా కోయిలకుంట్ల(M) కలుగొట్ల కాశిరెడ్డి నాయన ఆశ్రమం వద్దకు, సంజామల(M) వసంతాపురం గ్రామానికి వచ్చేదని ఏఎస్ఐ ప్రతాప్ రెడ్డి తెలిపారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News January 16, 2026

కమలాపురం: ప్రత్యక్ష రాజకీయాల్లోకి మాజీ ఎమ్మెల్యే

image

కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారనే చర్చ జరుగుతోంది. కమలాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వీర శివారెడ్డికి ప్రజల్లో ప్రత్యేకమైన గుర్తింపు, అనుచరవర్గం ఉంది. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజానాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.