News June 21, 2024
జమ్మలమడుగు: వ్యక్తి అనుమానాస్పద మృతి

జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని మైలవరం మండలం వద్దిరాల సచివాలయం వద్ద శుక్రవారం వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు తెలుస్తుంది. మృతుడు పెద్దముడియం గ్రామానికి చెందిన దూదేకుల హుస్సేన్ వలిగా గుర్తించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు గొల్లపల్లె క్రషర్ మిషన్ ఆపరేటర్ గా పని చేసేవాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మద్యం సేవించడం అలవాటు ఉంది. మృతికి గల కారణాలు తెలియాలి.
Similar News
News January 23, 2026
కడప: రూ.144 చెల్లిస్తే కొండంత భరోసా..!

కడప జిల్లాలో పాడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రాయితీతో కూడిన బీమాను ఈనెల 19 నుంచి అందుబాటులోకి తెచ్చింది. కేవలం 15% చెల్లింపుతో ఆవు, గేదె, గొర్రె, మేకలు చనిపోతే పాడిరైతు ఖాతాలో నగదు జమవుతోంది. ఈనెల 31వరకు జరుగే పశుఆరోగ్య శిబిరాల్లో నమోదు చేసుకోవాలి. మేలుజాతి ఆవులు, గేదెలు ఒక్కోదానికి మూడేళ్లకు రూ.288, నాటుజాతి పశువులకు మూడేళ్లకు రూ.144, గొర్రెలు, మేకలకు మూడేళ్ల కాలానికి రూ.56 చెల్లించాలి.
News January 23, 2026
కడప జిల్లాలో VRO సస్పెండ్.!

చెన్నూరు మండలం రామనపల్లి<<18926711>> VRO<<>> వేణుగోపాల్ను సస్పెండ్ చేస్తూ కడప కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ రెవెన్యూ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న వేణు గోపాల్పై అందిన లైంగిక వేధింపుల ఫిర్యాదు మేరకు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా VROను సస్పెండ్ చేస్తూ గురువారం కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు.
News January 23, 2026
కడప: Way2News ఎఫెక్ట్ VRO సస్పెండ్

చెన్నూరు మండలం రామనపల్లి<<18926711>> VRO<<>> వేణుగోపాల్ను సస్పెండ్ చేస్తూ కడప కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ రెవెన్యూ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న వేణు గోపాల్పై అందిన లైంగిక వేధింపుల ఫిర్యాదు మేరకు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా VROను సస్పెండ్ చేస్తూ గురువారం కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు.


