News October 7, 2025
జమ్మికుంట: గూడ్స్ రైలు కింద పడి వ్యక్తి మృతి

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారం రైల్వే గేటు వద్ద గూడ్స్ రైలు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. కాజీపేట- రామగుండం రైల్వే లైన్లో రామగుండం వైపు వెళ్తున్న గూడ్స్ రైలు కింద పడి మండలంలోని శాయంపేట గ్రామానికి చెందిన పంజాల సాగర్(43) ప్రాణాలు కోల్పోయాడు. అయితే మృతుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేదా ప్రమాదానికి గురై మృతి చెందాడా? అనే విషయం తెలియాల్సి ఉంది.
Similar News
News January 19, 2026
వినతుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే మెమోలు: కలెక్టర్

విశాఖ కలెక్టరేట్ మీటింగు హాలులో సోమవారం కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పీజీఆర్ఎస్ నిర్వహించారు. అంతకుముందు అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు పరిష్కారం చూపాలన్నారు. జీవీఎంసీలో సాధారణ, టౌన్ ప్లానింగ్ వినతులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్కి ఆదేశించారు. అలసత్వం వహిస్తే 2 సార్లు మెమోలు ఇవ్వాలని, మూడోసారి ఛార్జి మెమో ఇవ్వాలన్నారు.
News January 19, 2026
5 రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘అనగనగా ఒక రాజు’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. విడుదలైన 5 రోజుల్లోనే ఈ ఘనత అందుకుందని ట్వీట్ చేసింది. కాగా నవీన్ కెరీర్లో ఇదే తొలి రూ.100 కోట్ల మార్క్ మూవీ కావడం విశేషం.
News January 19, 2026
కాటన్ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

గువాహటిలోని <


