News November 16, 2025
జమ్మిచేడు రిజర్వాయర్లో గుర్తుతెలియని మృతదేహం

జోగులాంబ గద్వాల జిల్లా జమ్మిచేడు శివారులోని రిజర్వాయర్లో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 35 నుంచి 40 సంవత్సరాలు ఉండవచ్చని, నాలుగు రోజుల కిందట చనిపోయి ఉంటాడని పోలీసులు తెలిపారు. పసుపు రంగు టీ-షర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించిన వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే ఎస్ఐ శ్రీకాంత్ (87126 70296)కు ఫోన్ చేయగలరని తెలిపారు.
Similar News
News January 22, 2026
24న కాకినాడలో జాబ్ మేళా

కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 24న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి.శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాయల్ పార్క్, శ్రీ గోపాల్ ఆటోమేటిక్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలలో పనిచేసేందుకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉన్న టెన్త్ నుంచి డిగ్రీ చదివినవారు ఆరోజున ఉదయం10 గంటలకు ధ్రువపత్రాలతో కాకినాడ ఉపాధి కార్యాలయానికి హాజరుకావాలన్నారు.
News January 22, 2026
హరీశ్ రావు ‘ఫోన్’ క్యాపింగ్ నిజమేనా..?

ఫోన్ టాపింగ్ కేసులో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసి విచారించిన విషయం తెలిసిందే. కాగా దాదాపు 7 గంటల పాటు సాగిన ఈ విచారణ సమయంలో మీ ఫోనే ట్యాప్కు గురైందని సిట్ అధికారులు హరీశ్ రావుకు వివరించడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సొంత పార్టీ వారి పైనే నిఘా పెట్టారని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఫోన్ టాపింగ్పై కార్లిటీ రావాల్సి ఉంది.
News January 22, 2026
దెందులూరు: బ్రిడ్జి నిర్మాణంపై చింతమనేని సూచనలు

దెందులూరు నియోజకవర్గంలో నూతన రోడ్లు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రావు కలెక్టర్ కార్యాలయంలో గురువారం సమీక్షించారు. కొక్కిరపాడు నుంచి దాసరిగూడెం వెళ్లే మార్గం, పెదపాడు మండలంలోని వట్లూరు సహా పలు ప్రాంతాల్లో ఆర్ఓబి, ఆర్ యు బిల నిర్మాణాలు చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ వెట్రి సెల్వి, జేసి, తదితరులు పాల్గొన్నారు.


