News April 23, 2025

జమ్ములో ఉగ్ర దాడి.. తీవ్రంగా ఖండించిన ఎంపీ

image

జమ్ము కశ్మీర్‌లో మంగళవారం టూరిస్ట్‌లపై ఉగ్రవాదులు దాడికి తెగబడిన విషయం తెలిసిందే. దీనిపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ట్రెక్కింగ్‌కు వెళ్లిన పర్యాటకులపై కాల్పులు జరపడం తనను కలిచి వేసిందన్న ఆయన.. నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కోరారు. దేశ సరిహద్దులో మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉగ్రవాదులకు గట్టిగా బుద్ది చెప్పాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Similar News

News March 9, 2026

కావలి: చదివింది 5th.. రూ.150 కోట్లకు కుచ్చుటోపి.!

image

చదివింది 5th. రియల్ ఎస్టేట్‌లో అంచెలంచెలుగా ఎదిగి HYDలో త్రిపుర కన్‌స్ట్రక్షన్ ప్రారంభించాడు. ప్రజల నుంచి ప్లాట్ల పేరుతో భారీగా వసూలు చేశాడు. ఎన్నికల్లో జనసేన నుంచి పోటీచేసి దాదాపు రూ.150 కోట్లు ఖర్చు చేసినా డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయాడు కావలికి చెందిన పసుపులేటి సుధాకర్. ప్రజలు నిలదీయడంతో ఆయన బండారం బయటపడింది. అపార్ట్‌మెంట్స్ పేరుతో ప్రజలను మోసం చేసిన కేసులో పోలీసులు దంపతులను అరెస్ట్ చేశారు.

News March 9, 2026

దుత్తలూరులో రక్షణ రంగ పరిశ్రమ

image

దుత్తలూరు పరిసర ప్రాంతంలో ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే దేశానికి కీలక వ్యవస్థగా ఉన్న రక్షణ రంగం ముడి సరుకు తయారీ ప్రాంతంగా దుత్తలూరు కేంద్రం కానున్నడంతో ఈ ప్రాంత నిరుద్యోగులకు మరింత ఆశలు చిగురించాయి. ప్రభుత్వం జీవో నెం.41ను సైతం విడుదల చేసింది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో 250 మందికి ప్రత్యక్షంగా, మరో 250 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది.

News March 9, 2026

CI రవి నాయక్, SI ప్రసాద్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

image

కృష్ణపట్నం సర్కిల్ సీఐ రవి నాయక్, ముత్తుకూరు ఎస్ఐ ప్రసాద్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. పొక్సో కేసు ముద్దాయి విషయంలో అలసత్వం వహించారనే ఆరోపణలతో వీరిని సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. ఓకే సర్కిల్ పరిధిలోని ఎస్ఐ, సీఐ సస్పెండ్‌తో కలకలం రేగింది.