News April 29, 2024

జహీరాబాద్: ఓటర్లు పెరిగారు.. మరి ఓటింగ్ శాతం పెరిగేనా?

image

జహీరాబాద్ లోక్‌సభ స్థానంలో ఓటర్ల సంఖ్య పెరిగింది. 2019 నుంచి 2024 వరకు ఈ స్థానంలో 1,45,912 మంది కొత్త ఓటర్లు చేరారు. ఈ పార్లమెంటు పరిధిలో మొత్తం 16,40,755 మంది ఓటర్లు ఉన్నారు. ఈ లోక్‌సభ స్థానానికి 2009లో 74.67 శాతం, 2014లో 77.28 శాతం, 2019లో 69.70 శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం పెరిగిన ఓటర్ల సంఖ్యతో ఈసారి పోలింగ్ శాతం పెరగనుందని పలువురు భావిస్తున్నారు.

Similar News

News April 19, 2026

మెదక్: ఇంటికి చేరాలి.. షార్ట్ ఫిల్మ్‌ను ప్రారంభించిన ఎస్పీ

image

మెదక్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై అవగాహన కోసం రూపొందించిన “ఇంటికి చేరాలి…” అనే షార్ట్ ఫిల్మ్‌ను ఎస్పీ శ్రీనివాసరావు ప్రారంభించారు. 99 రోజుల ప్రజా ప్రణాళిక “సురక్షిత ప్రయాణం” కార్యక్రమంలో భాగంగా రూపొందిన ఈ చిత్రం యువతలో మార్పు తీసుకురావడమే లక్ష్యంమని, హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని, జరిమానాలు, శిక్ష కోసం కాకుండా ప్రాణ రక్షణ కోసం అనే సందేశాన్ని అందిస్తోందని తెలిపారు.

News April 19, 2026

మెదక్: ఏప్రిల్ 20 నుంచి సంక్షేమ వారం: కలెక్టర్

image

ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 20 నుంచి 26 వరకు 7 రోజుల సంక్షేమ వారాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సీఎస్ రామకృష్ణారావు సూచించినట్లు కలెక్టర్‌ ప్రతిమా సింగ్ తెలిపారు. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో పారిశుద్ధ్యం, మరమ్మతులు చేపట్టాలన్నారు. విద్యార్థులకు క్విజ్, చిత్రలేఖనం వంటి పోటీలు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు జరిపించాలన్నారు.

News April 19, 2026

మెదక్: ఏప్రిల్ 20 నుంచి సంక్షేమ వారం: కలెక్టర్

image

ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 20 నుంచి 26 వరకు 7 రోజుల సంక్షేమ వారాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సీఎస్ రామకృష్ణారావు సూచించినట్లు కలెక్టర్‌ ప్రతిమా సింగ్ తెలిపారు. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో పారిశుద్ధ్యం, మరమ్మతులు చేపట్టాలన్నారు. విద్యార్థులకు క్విజ్, చిత్రలేఖనం వంటి పోటీలు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు జరిపించాలన్నారు.