News April 2, 2024
జిల్లాలోని పలు ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా ఎండలు

చుంచుపల్లి: వేసవికాలం ఆరంభంలోనే భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. సోమవారం సూర్యుడు భగ్గుమన్నాడు. కొత్తగూడెం పరిధిలోని గరిమెళ్లపాడు, భద్రాచలం సబ్ కలెక్టరేట్ ఏరియాల్లో 41.3 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాత కొత్తగూడెంలో 40.5, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్లో 40.4, సీతారాంపట్నం, యానంబైలులో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు
Similar News
News February 15, 2026
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు వరుసగా 3 రోజులు సెలవులు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. ఆదివారం వారాంతపు సెలవుతో పాటు, సోమవారం (16-02-2026) మహాశివరాత్రి, మంగళవారం అమావాస్య సందర్భంగా మార్కెట్ లావాదేవీలు నిలిపివేయనున్నారు. తిరిగి బుధవారం నుంచి మార్కెట్ యథావిధిగా పనిచేస్తుందని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి, క్రయవిక్రయాల కోసం బుధవారం మార్కెట్కు రావాలని అధికారులు కోరారు.
News February 14, 2026
పాలేరు చెరువులోకి దూసుకెళ్లిన కారు.. వ్యక్తి దుర్మరణం

ఖమ్మం జిల్లా పాలేరు చెరువులో ఘోర ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన ఓ కారు వేగంగా చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న వ్యక్తి నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతుడు APకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. స్థానిక జాలర్ల సాయంతో కారును బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 14, 2026
సత్తుపల్లిలో.. ఆ భార్యాభర్తలు ఓడిగెలిచారు..!

సత్తుపల్లి ఆ భార్యాభర్తలు ఓడి.. గెలిచినట్లయ్యింది. మాజీ ఛైర్మన్ కూసంపూడి మహేష్ 14వ వార్డులో గెలవగా ఆయన సతీమణి మాధురి ఓడారు. అదేవిధంగా తాజాగా ఛైర్మన్ రేసులో ఉన్న రెహనాబేగం 22లో గెలవగా ఆమె భర్త కమల్ పాషా అపజయం పాలయ్యారు. కాగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన సత్తుపల్లి మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్యానల్ 17 అభ్యర్థులతో హస్తగతం చేసుకుంది. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్లో ఆరుగురు మాత్రమే గెలిచారు.


