News November 16, 2025

జిల్లాలో లాటరీ మోసాలపై ఉక్కుపాదం: ఎస్పీ నరసింహ

image

సూర్యాపేట జిల్లాలో స్థిరాస్తి లాటరీల పేరుతో జరిగే ఆర్థిక మోసాలపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. ‘1000 కట్టు.. ఫ్లాటు పట్టు’ వంటి మోసపూరిత పథకాల ద్వారా అమాయకులను లక్ష్యంగా చేసుకునే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని స్పష్టం చేశారు. లాటరీల రూపంలో భూములు, ఫ్లాట్లు అమ్మడం చట్టవిరుద్ధం అన్నారు. అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.

Similar News

News January 12, 2026

నెల్లూరు: మన నిమ్మకు.. ఉత్తరాదిన ధీమా.!

image

నెల్లూరు జిల్లా నుంచి దేశంలో పలు ప్రాంతాలకు అత్యధికంగా నిమ్మ పంట ఎగుమతి అవుతుంది. ఢిల్లీ, బిహార్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, UPలకు సీజన్‌లో ఎక్కువగా, అన్ సీజన్ TN, కర్ణాటక, కేరళకు వెళ్తున్నాయి. 23-24లో 50628 క్వింటాళ్లు (రూ.14.99 cr), 24-25లో 36579 క్వింటాళ్లు (రూ.14.73cr), 25-26లో 21631 క్వింటాళ్లు (రూ.6.16cr) విక్రయాలు జరిగాయి. ప్రస్తుత కలెక్టర్ చొరవతో నిమ్మ KG రూ.22 ఉందని రైతులన్నారు.

News January 12, 2026

‘సేవలందిస్తున్న వారిని గుర్తించి అవార్డులకు ప్రతిపాదించాలి’

image

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‍భవన్‌లో నిర్వహించే కార్యక్రమంలో సామాజిక సేవలో పాల్గొనే వారికి అవార్డుల ప్రధానం జరుగుతుందని జేసీ భావన చెప్పారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్‌లో ఆమె అధికారులతో సమావేశం నిర్వహించారు. సామాజిక సేవలో పాల్గొనే ఉద్యోగులు, వివిధ సంస్థలు, సామాజిక సేవలు అందిస్తున్న వారిని గుర్తించి అవార్డులకు ప్రతిపాదించాలని ఆదేశించారు.

News January 12, 2026

గుమ్మానికి ఎదురుగా కిటికీ ఉండవచ్చా?

image

ఇంటి గుమ్మానికి ఎదురుగా కిటికీ ఉండటం మంచిదంటున్నారు వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు. ఈ నిర్మాణం బయట నుంచి వచ్చే సహజ గాలి, వెలుతురును అన్ని గదుల్లోకి ప్రసరించేలా చేస్తుందంటున్నారు. ‘ఇది గదిలో ఉండే వారికి మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఇల్లు ఎప్పుడూ తాజాదనంతో ఉంటుంది. ఇంట్లో ప్రతికూలత తగ్గి, గృహస్థులు ఉత్సాహంగా తమ జీవితాన్ని గడపడానికి దోహదపడుతుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>