News December 3, 2025
జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించాలి: కలెక్టర్

జిల్లా వ్యాప్తంగా 347 రైతు సేవా కేంద్రాల వద్ద ‘రైతన్న మీకోసం’ గ్రామ సభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మంగళవారం వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో, 2025-26 రబీ, 2026 ఖరీఫ్, 2026-27 రబీ సీజన్ల పంట ప్రణాళికలపై రైతులతో తప్పక చర్చించాలని ఆమె సూచించారు.
Similar News
News February 13, 2026
NZB: స్రవంతి రెడ్డికి (BJP) సర్టిఫికెట్ అందజేత

నిజామాబాద్ నగరంలోని 6వ డివిజన్లో గెలుపొందిన బీజేపీ అభ్యర్థి గోపిడి స్రవంతి రెడ్డికి ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రం అందజేశారు. కంఠేశ్వర్ ప్రాంతానికి చెందిన గోపిడి స్రవంతి రెడ్డిని బీజేపీ తరఫున మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. గత కార్పొరేషన్లో ఆమె బీజేపీ ఫ్లోర్ లీడర్గా పని చేశారు.
News February 13, 2026
శ్రీకాళహస్తీశ్వరునికి కనకదుర్గమ్మ పట్టు వస్త్రాలు సమర్పణ

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం తరఫున శుక్రవారం పట్టు వస్త్రాలను పంపిణీ చేశారు. కనకదుర్గమ్మ ఆలయం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ బుర్ర రాధాకృష్ణ (గాంధీ), సభ్యులు, ఆలయ ఈఓ శినా నాయక్, ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ కొట్టేసాయి ప్రసాద్, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ EO T. బాపిరెడ్డిలకు అందజేశారు. ఈ సందర్భంగా విజయవాడ ఆలయ అధికారులకు ఆలయ మర్యాదలతో సత్కరించారు.
News February 13, 2026
తిరుపతి: అనాధికారిక డీకేటీ ఇళ్ల పన్ను మార్పులపై ఫిర్యాదు

తిరుపతి కార్పొరేషన్ పరిధిలో 190 డీకేటీ ఇళ్లకు సంబంధించి వెబ్ సైట్ ద్వారా అనాధికారికంగా పన్ను మార్చారు. గడిచిన రెండేళ్లుగా డీకేటీ పన్ను మార్పు చేయడం లేదు. దీంతో కొందరు దొడ్డిదారిన ఈ పని చేసినట్లు డీసీ గుర్తించి కమిషనర్ మౌర్య దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై శుక్రవారం ఎస్పీకి రాతపూర్వకంగా ఏ ULR నుంచి మార్పు చేశారు. ఎవరు మార్చుకున్నారో విచారణ చేసి కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.


