News February 27, 2025

జీడీ నెల్లూరు: సీఎం పర్యటనకు పటిష్ఠ బందోబస్తు

image

మార్చి 1న సీఎం చంద్రబాబు పర్యటనకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ మణికంఠ తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ సుమిత్ కుమార్‌తో కలిసి ఆయన గురువారం పర్యవేక్షించారు. సీఎం పర్యటన ముగిసే వరకు ఎలాంటి అలసత్వం వహించకుండా బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైయుజన్ నిర్వహించి అధికారులు చేపట్టాల్సిన విధులపై దిశా నిర్దేశం చేశారు.

Similar News

News February 28, 2025

చిత్తూరు: జర్నలిస్టుల అక్రిడేషన్ గడువు పెంపు

image

జిల్లాలో ఫిబ్రవరి 28 తో ముగియనున్న జర్నలిస్టుల అక్రిడేషన్‌ను పొడిగిస్తూ సమాచార పౌర సంబంధ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం తెలిపారు. మార్చి 1 నుంచి మే 31 వరకు లేక కొత్త కార్డులు మంజూరు చేయడం ఏది ముందు జరిగితే అప్పటివరకు కాల పరిమితిని పొడిగించినట్లు ఆయన చెప్పారు. ఫిబ్రవరి 28 నాటికి అక్రిడేషన్ కార్డులు ఉన్న వారికి మాత్రమే ఈ సౌకర్యం ఉంటుందన్నారు.

News February 27, 2025

ఆడపిల్లలను అక్కున చేర్చుకున్న చిత్తూరు కలెక్టర్

image

గంగాధర నెల్లూరులోని ఓ దంపతులకు రక్షిత, హేమశ్రీ అనే ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. కొన్ని అనివార్య కారణాలతో తల్లిదండ్రులు విడిపోయి వారి జీవితాలను మరొకరితో పంచుకున్నారు. ఈ కారణంగా అనాథలైన రక్షిత, హేమశ్రీ బాగోగులు వారి తాతయ్య చూసుకుంటున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న కలెక్టర్ సుమిత్ కుమార్.. ఇద్దరి పిల్లల ఉన్నత విద్య బాధ్యత తానే తీసుకున్నట్లు ప్రకటించారు. దీంతో పలువురు కలెక్టర్‌ను అభినందిస్తున్నారు.

News February 27, 2025

చిత్తూరులో వృద్ధురాలి సూసైడ్

image

వృద్ధురాలు ఉరి వేసుకొని మృతి చెందిన ఘటన చిత్తూరు వైఎస్ నగర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై మల్లికార్జున తెలిపిన వివరాల ప్రకారం.. గత కొంతకాలంగా జ్ఞానమని (65) అనే వృద్ధురాలు తీవ్రమైన నడుము నొప్పి, కడుపు నొప్పితో బాధపడుతోంది. బుధవారం నొప్పి భరించలేక మనస్తాపానికి గురై ఇంట్లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా మనవడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. మార్గ మద్యమంలో మృతి చెందగా, కేసు నమోదు చేశామన్నారు.

error: Content is protected !!