News June 20, 2024
జులై 1వ తేదీకి రూ.10 వేల కోట్లు కావాలి!

AP: జులై ఒకటో తేదీ నాటికి రూ.10 వేల కోట్లను సమీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల హామీలో భాగంగా వృద్ధులు, దివ్యాంగులకు పెంచిన పింఛను ఇవ్వాల్సి ఉంది. అలాగే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి వృద్ధులకు పెంచిన పింఛను బకాయిలు రూ.1000 చొప్పున ఇవ్వాలి. వీటికి రూ.4408.31 కోట్లు అవసరమవుతాయి. ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పింఛన్లు ఇచ్చేందుకు రూ.5500 కోట్లు కావాలి.
Similar News
News January 20, 2026
NALCOలో 110 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (NALCO)లో 110 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. బీటెక్/బీఈ(మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్) ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. గేట్- 2025 స్కోరు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. వెబ్సైట్: https://mudira.nalcoindia.co.in
News January 20, 2026
ఇతిహాసాలు క్విజ్ – 129

ఈరోజు ప్రశ్న: రావణుడి సోదరి శూర్పణఖ అసలు పేరు ఏమిటి? ఆ పేరుకు అర్థం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News January 20, 2026
‘వ్యవసాయ యాంత్రీకరణ’ పథకంలో రాయితీ ఇలా..

TG: ఈ పథకం కింద యంత్రాల కొనుగోలుకు ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇస్తోంది. లబ్ధిదారుల కేటగిరీని బట్టి దీనిలో వాటా ఉంటుంది. సన్న, చిన్నకారు, మహిళా రైతులు, SC, ST, BC రైతులు యంత్రాన్ని కొనుగోలు చేస్తే ధరలో 50% వారు భరించాలి. మిగిలిన 50 శాతాన్ని ప్రభుత్వం రాయితీగా నేరుగా కంపెనీ ఖాతాలో జమ చేస్తుంది. ఇతర రైతులు యంత్రం ధరలో 60 శాతం వాటాను భరించాల్సి ఉండగా.. 40 శాతాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుంది.


