News October 5, 2025
జూబ్లీహిల్స్ బైపోల్లో మిగిలింది ముగ్గురే?

జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. అభ్యర్థుల జాబీతాలో నవీన్యాదవ్, మాజీ మేయర్ బొంతురామ్మోహన్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి పేర్లను చేర్చారు. ఇన్ఛార్జ్ మంత్రులు షార్ట్లిస్ట్ను ఫైనల్ చేశారు. అనంతరం స్క్రీనింగ్ కమిటీకి ఈ లిస్ట్ను TPCC పంపనుంది. త్వరలోనే అభ్యర్థిని హైకమాండ్ ఫైనల్ చేయనుంది. దీంతో జాబ్లీ హైడ్రామాలో కొత్త అభ్యర్థుల పేర్లతో మరో మలుపు తీసుకుంది
Similar News
News January 18, 2026
ఇండియాకు mitc‘Hell’ చూపిస్తున్నాడు..

భారత బౌలర్లకు న్యూజిలాండ్ ప్లేయర్ మిచెల్ చుక్కలు చూపిస్తున్నారు. గత మ్యాచులో సెంచరీతో చెలరేగిన ఈ ప్లేయర్ మూడో వన్డేలోనూ అర్ధశతకం బాదారు. 56 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నారు. ఈ సిరీస్లో అతడికి ఇది మూడో 50+ స్కోరు కావడం గమనార్హం. ఓవరాల్గా వన్డేల్లో భారత్పై 11 ఇన్నింగ్సుల్లో 600+ రన్స్ చేయగా ఆరు సార్లు 50+కి పైగా పరుగులు చేశారు. అద్భుతమైన ఫామ్తో ODI ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో ఉన్నారు.
News January 18, 2026
పోచంపల్లి ఇక్కత్కు జర్మనీ దేశస్థులు ఫిదా!

అంతర్జాతీయ ప్రసిద్ధి గాంచిన పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల తయారీని చూసి జర్మనీ దేశస్థులు మంత్రముగ్ధులయ్యారు. ఆదివారం వారు భూదాన్ పోచంపల్లిని సందర్శించి, టూరిజం పార్కులోని మగ్గాలను పరిశీలించారు. నూలుదారానికి రంగులు అద్దడం, చిటికిలుచుట్టడం, మగ్గంపై చీర నేసే ప్రక్రియను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక దుకాణాల్లో ఇక్కత్ వస్త్రాలను కొనుగోలు చేశారు. చేనేత కళాకారుల నైపుణ్యాన్ని వారు అభినందించారు.
News January 18, 2026
సీఎం పర్యటనకు ఇందిరమ్మ చీరలతో రాకుంటే జరిమానా!

మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనకు డ్వాక్రా మహిళా సంఘాలను రావాల్సిందిగా అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల పంపిణీ చేసిన ఇందిరమ్మ చీరలతో సీఎం పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా ఉండాలని లేకుంటే రూ.500, రూ.1000 జరిమానా విధిస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. బలవంతంగా పనులు వదిలేసి తాము ఎలా వెళ్లాలని మహిళా సంఘాలు సతమతమవుతున్నారని సమాచారం.


