News November 8, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: రేపు సాయంత్రం నుంచి ప్రచారం బంద్

జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం తుది అంకానికి చేరుకుంది. రేపు సాయంత్రం వరకు ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఉంది. EC నిబంధనల ప్రకారం సాయంత్రం తర్వాత మైకులు బంద్ చేయాలి. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి వైన్స్ కూడా మూతబడనున్నాయి. నవంబర్ 11న పోలింగ్ ఉండడంతో ఓటర్లకు గాలం వేసేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. గెలుపు ఓటముల్లో పోల్ మేనేజ్మెంట్ కీలకం కానుంది.
Similar News
News January 24, 2026
నెల్లూరు: బాల్యవివాహాల.. ఈ నంబర్కు ఫోన్ చేయండి

పొదలకూరు మండలం మొగళ్లూరు అంగన్వాడీ కేంద్రంలో ECCE డే సందర్భంగా బాల్యవివాహాల నివారణపై ఐసీడీఎస్ సీడీపీవో వి.విజయలక్ష్మి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్యవివాహాలు బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు.18 ఏళ్లు నిండకముందే ఎక్కడైనా పెళ్లిలు జరుగుతుంటే టోల్ఫ్రీ నంబర్ 1098కి కాల్ చేయాలని తెలిపారు.
News January 24, 2026
సిద్దిపేట: మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జీల నియామకం

సిద్దిపేట జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికల ఇన్ఛార్జీలను బీఆర్ఎస్ అధిష్ఠానం శనివారం నియమించింది. గజ్వేల్కు రాధాకృష్ణ శర్మ, దుబ్బాకకు గుండు భూపేష్, హుస్నాబాద్కు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, చేర్యాలకు ఎల్లు రవిందర్ రెడ్డిను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల పర్యవేక్షణ, అభ్యర్థుల ఎంపికలో వీరు కీలక పాత్ర పోషించనున్నారు.
News January 24, 2026
HYD: రేపు లుంబినీ పార్కు వద్ద సందడి!

హైదరాబాద్ గగనతలం దేశభక్తి గీతాలతో ప్రతిధ్వనించనుంది. గణతంత్ర వేడుకలు, వందేమాతరం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆర్టిలరీ సెంటర్ ఆధ్వర్యంలో రేపు (ఆదివారం) సాయంత్రం 4 గంటలకు లుంబినీ పార్కులోని తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నం వద్ద భారీ ‘మిలిటరీ బ్యాండ్’ ప్రదర్శన జరగనుంది. సైనికుల క్రమశిక్షణ, సంగీత విన్యాసాల కలబోతగా సాగే ఈ వేడుక నగరవాసులకు కనువిందు చేయనుంది.


