News November 19, 2025
జైనథ్: 8 మంది దొంగల అరెస్ట్

ఈ నెల 14న జైనథ్లోని హాత్తిఘాట్ పంపుహౌస్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి గురైన రూ.4.8 లక్షల సామగ్రిని రికవరీ చేశారు. మంగళవారం 12 మందిపై కేసు నమోదు చేసి, ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. దొంగిలించిన సామగ్రి, రెండు మొబైల్ ఫోన్లు, ఒక ఆటో, రూ.7,140 నగదును స్వాధీనం చేసుకున్నారు. సామగ్రి కొనుగోలు చేసిన స్క్రాప్ దుకాణదారుడిని కూడా రిమాండ్కు పంపినట్లు సీఐ శ్రావణ్ కుమార్ తెలిపారు.
Similar News
News January 21, 2026
ఆదిలాబాద్: రేపు ఇంటర్ ప్రాక్టికల్స్ యథాతథం

ఇంటర్మీడియట్ విద్యార్థులకు తొలిరోజు ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఆదిలాబాద్ DIEO జాధవ్ గణేష్ తెలిపారు. గురువారం కూడా ప్రాక్టికల్స్ యథావిధిగా కొనసాగుతాయని నాగోబా సెలవు ఉండదని స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి ప్రాక్టికల్కు హాజరు కావాలని సూచించారు. కాగా బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలికల)లో జరిగిన ప్రాక్టికల్ పరీక్షలను DIEO సందర్శించి పరిశీలించారు.
News January 21, 2026
ఆదిలాబాద్: ’23న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్’

హైదరాబాద్ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు జనవరి 23వ తేదీన జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ (MPTM) నిర్వహిస్తున్నట్లు DIEO జాధవ్ గణేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో తల్లిదండ్రులు తప్పనిసరిగా పాల్గొని విద్యార్థుల అభివృద్ధికి సహకరించాలని కోరారు. సమావేశం విద్యార్థుల విద్యా ప్రగతికి కీలకమని, తల్లిదండ్రులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
News January 21, 2026
ఆదిలాబాద్: JEE మెయిన్స్.. తొలిరోజు 8మంది గైర్హాజరు

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 9 గంటల నుంచి మ.12 గంటల వరకు మ.3 గంటల నుంచి సా.6 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరిగాయి. ఉదయం జరిగిన పరీక్షకు వంద మందికి గాను 93 మంది హాజరై ఏడుగురు గైర్హాజరయ్యారని, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 99 మంది హాజరై.. ఒక్కరు గైర్హాజరయ్యారని పరీక్షల కో-ఆర్డినేటర్, కళాశాల ప్రిన్సిపల్ పున్నారవ్ తెలిపారు.


