News March 16, 2025

జ్వరం గోళీలు ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్: హరీష్ రావు

image

జ్వరం గోళీలు కూడా ఇవ్వాలని దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ‘X’ వేదికగా మండిపడ్డారు. సర్కార్ దావఖానాలలో మందులు లేవన్న పత్రికా కథనాలను పోస్ట్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మళ్లీ ఉమ్మడి పాలన నాటి దుర్భర పరిస్థితులను ముందుకు తెచ్చిందని విమర్శించారు. జ్వరం గోలీలు, కనీసం చిన్న పిల్లలకు ఇచ్చే సిరప్ కూడా లేకపోవడం సీఎం పనితనానికి నిదర్శనం అన్నారు.

Similar News

News April 11, 2026

కేజీబీవీలో ప్రవేశాలకు గడువు పొడిగింపు: డీఈవో

image

జిల్లాలోని కేజీబీవీలో 2026-27 ఏడాదికి 6,7,8,9,10, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాల దరఖాస్తులను ఈనెల 20 వరకు పొడిగించినట్లు డీఈవో మాణిక్యం నాయుడు తెలిపారు. రేపటితో ప్రవేశాల దరఖాస్తుల ప్రక్రియ ముగిసినప్పటికీ, విద్యార్థుల తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు మరోసారి గడువు పొడిగించినట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ బాలికలు దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం పేర్కొన్నారు.

News April 11, 2026

పోస్టల్ శాఖలో ఉద్యోగాలు.. ఫలితాలు విడుదల

image

పోస్టల్ శాఖలో గ్రామీణ డాక్ సేవక్(GDS) ఉద్యోగాల భర్తీకి JANలో ఇచ్చిన 28,636 పోస్టుల భారీ నోటిఫికేషన్ <>రెండో షార్ట్ లిస్ట్<<>> విడుదలైంది. మొత్తం పోస్టుల్లో ఏపీలో 1060, TGలో 608 ఖాళీలున్నాయి. తాజా లిస్టులో AP నుంచి 555 మంది, TG నుంచి 214 మంది ఎంపికయ్యారు. వీరంతా APR 27వ తేదీ లోగా డివిజనల్ ఆఫీసులో ధ్రువపత్రాలతో హాజరు కావాల్సి ఉంటుంది. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేపట్టిన విషయం తెలిసిందే.

News April 11, 2026

పిట్లం: వేసవి తాపానికి ప్రకృతి ప్రసాదం

image

వేసవి తాపాన్ని తీర్చుకోవడానికి ప్రకృతి ప్రసాదించిన చలువ ముంజలు మార్కెట్లోకి వచ్చేశాయి. పిట్లం మండలం కుర్తి గేట్ వద్ద తాటి ముంజల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ డజను ముంజలు రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు. ఎండ తీవ్రత పెరుగుతుండటంతో అటుగా వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ముంజలకు ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్పడింది.