News April 30, 2024
టీడీపీ నుంచి సివేరి అబ్రహం సస్పెన్షన్

అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు సివేరి అబ్రహంను తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. కాగా.. అరకు సీటు ఆశించి భంగపడ్డ అబ్రహం ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
Similar News
News April 18, 2026
సోమవారం విశాఖ సీపీ కార్యాలయంలో PGRS రద్దు

సోమవారం విశాఖ సీపీ కార్యాలయంలో జరగాల్సిన PGRS రద్దు చేస్తున్నట్లు సీపీ శంఖబ్రత బాగ్చి శనివారం తెలిపారు. సోమవారం సింహాచలం చందనోత్సవ నేపథ్యంలో పోలీస్ అధికారులందరూ బందోబస్తు విధులు నిర్వహించనున్నందున ఆరోజు పోలీస్ ఉన్నత అధికారులు అందుబాటులో ఉండరని తెలిపారు. విశాఖ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News April 18, 2026
ఉపాధి కోసం పోలాండ్ వెళ్లిన విశాఖ వాసి మృతి

ఉపాధి కోసం 8 నెలల క్రితం పోలాండ్ వెళ్లిన విశాఖ వాసి మృతి చెందారు. భీమునిపట్నం మండలం మహాలక్ష్మీపురానికి చెందిన గోకేటి ప్రసాద్ బాబు (45) పోలాండ్ వెళ్లారు. అక్కడ అనారోగ్యం బారిన పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఎంపీ శ్రీభరత్ చొరవతో మృతదేహాన్ని రప్పించే ప్రక్రియ వేగవంతమైందని చెప్పారు. ఆదివారం రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్న పార్థివదేహాన్ని అనంతరం విశాఖకు తరలించనున్నట్లు సమాచారం.
News April 18, 2026
ఉపాధి కోసం పోలాండ్ వెళ్లిన విశాఖ వాసి మృతి

ఉపాధి కోసం 8 నెలల క్రితం పోలాండ్ వెళ్లిన విశాఖ వాసి మృతి చెందారు. భీమునిపట్నం మండలం మహాలక్ష్మీపురానికి చెందిన గోకేటి ప్రసాద్ బాబు (45) పోలాండ్ వెళ్లారు. అక్కడ అనారోగ్యం బారిన పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఎంపీ శ్రీభరత్ చొరవతో మృతదేహాన్ని రప్పించే ప్రక్రియ వేగవంతమైందని చెప్పారు. ఆదివారం రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్న పార్థివదేహాన్ని అనంతరం విశాఖకు తరలించనున్నట్లు సమాచారం.


