News November 19, 2025
ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు: వరంగల్ పోలీసులు

ద్విచక్రవాహనాలపై ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదని వరంగల్ కమిషనరేట్ పోలీసులు ప్రజలకు సూచించారు. కమిషనరేట్ పరిధిలోని ప్రజలు ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని కోరారు. సురక్షిత డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Similar News
News January 20, 2026
హైదరాబాద్కు అండర్ గ్రౌండ్ రివర్

HYD దాహాన్ని తీర్చడానికి ప్రభుత్వం రూ.7,360 కోట్లతో ‘అండర్ గ్రౌండ్ రివర్’ను సృష్టిస్తోంది. ఇప్పటిదాకా మనం విన్నది కేవలం పైప్లైన్ల గురించి మాత్రమే. కానీ ఈ ప్రాజెక్టు అసలు ఉద్దేశం సిటీకి 50 ఏళ్ల వాటర్ గ్యారెంటీ ఇవ్వడం. 50 TMC మల్లన్నసాగర్ను ఒక భారీ ‘పవర్ బ్యాంక్’లా వాడుకుంటూ అందులోని 20 TMCలను సిటీకి మళ్లించబోతున్నారు. వాతావరణం ఎలా ఉన్నా నగరం చుట్టూ ఉన్న రిజర్వాయర్లు ఎప్పుడూ కళకళలాడుతూనే ఉంటాయి.
News January 20, 2026
ఒకే రోజు రూ.22వేలు పెరిగిన వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధర ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. ఇవాళ ఒక్కరోజే <<18903989>>కేజీ<<>> వెండిపై రూ.22వేలు పెరిగి రూ.3,40,000కు చేరింది. కేవలం 10 రోజుల్లోనే వెండి ధర రూ.65వేలు పెరిగి ఇన్వెస్టర్లకు భారీ లాభాలనిచ్చింది. అటు 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.2,130 పెరిగి రూ.1,48,370, 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,950 ఎగబాకి రూ.1,36,000 పలుకుతోంది.
News January 20, 2026
ఈపూరుపాలెం పీహెచ్సీలో మలేరియా అధికారి తనిఖీ

ఈపూరుపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా మలేరియా అధికారి వి.నాగార్జునరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ల్యాబ్ రికార్డులు పరిశీలించి, రక్త పరీక్షల ఫలితాలు త్వరగా ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. రికార్డులు సక్రమంగా నిర్వహించాలన్నారు. అనంతరం బాపట్ల వ్యవసాయ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో దోమల నివారణకు చేపట్టిన మలాథియన్ స్ప్రేయింగ్ పనులను ఆయన పర్యవేక్షించారు.


