News August 23, 2024

డయాఫ్రం వాల్ కట్టకుంటే గోదావరి జిల్లాలకు ముప్పు: CM

image

పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఒక వరమని వానపల్లి సభా వేదికగా సీఎం చంద్రబాబు అన్నారు. అలాంటి పోలవరంను దుర్మార్గుడైన జగన్ గోదావరిలో కలిపేశారని, డయాఫ్రం వాల్ నాశనమైందని, కాపర్ డ్యాంలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. మళ్లీ కొత్త డయాఫ్రం వాల్ కట్టాల్సి వస్తుందన్నారు. లేదంటే ఏదైనా ప్రమాదం జరిగితే ఉభయ గోదావరి జిల్లాలు కొట్టుకుపోయే పరిస్థితి వస్తుందని తెలిపారు. తొందర్లోనే పోలవరంను పూర్తి చేస్తామన్నారు.

Similar News

News January 23, 2026

నరసాపురం: ‘తాబేళ్ల సంరక్షణకు చర్యలు’

image

తీర ప్రాంత గ్రామాల్లో సముద్ర పర్యావరణ పరిరక్షణకు దోహదపడే తాబేళ్లను సంరక్షించేందుకు, వాటి సంతతిని పెంచేందుకు అటవీ శాఖా పరంగా చర్యలు చేపట్టినట్లు జిల్లా అటవీశాఖ అధికారి డీఏ కిరణ్ తెలిపారు. గురువారం పీఎం లంక, కేపీపాలెం సముద్ర తీరంలో తాబేళ్ల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు వచ్చి విలేకరులతో మాట్లాడారు.

News January 22, 2026

రైతులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి: కలెక్టర్ నాగరాణి

image

ఉద్యానవన పంటలలో సాంకేతికతను అందిపుచ్చుకుని రైతులు లాభాలను గడించాలని కలెక్టర్ నాగరాణి పేర్కొన్నారు. తణుకు మండలం యర్రాయి చెరువు గ్రామంలో రెండు ఎకరాల విస్తీర్ణంలో కూరగాయలు పండించేందుకు రూ.1.40 కోట్లు వ్యయంతో ఏర్పాటుచేసిన హైడ్రోపోనిక్ యూనిట్ గురువారం ఆమె సందర్శించి మాట్లాడారు. జిల్లాలో అభ్యుదయ రైతులు హైడ్రోపోనిక్ యూనిట్స్ ఏర్పాటుకు ముందుకు రావాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

News January 22, 2026

పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలి: ఎస్పీ

image

సాంకేతికతను వినియోగించుకుంటూ సమన్వయంతో పని చేసి పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ నయీం అస్మి అన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు రాజీపడేది లేదని అన్నారు. గురువారం ఎస్పీ క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లాలోని డీఎస్పీ, సీఐలతో నేర సమీక్షను నిర్వహించారు. 2025 డిసెంబర్ నెలకు సంబంధించిన నేరాల దర్యాప్తు పురోగతిని క్షుణ్ణంగా సమీక్షించారు. కేసుల దర్యాప్తులో వేగం పెంచాలన్నారు.