News January 11, 2026
డీ హైడ్రేషన్ ఉంటే ఏమవుతుందంటే?

డీహైడ్రేషన్ ఊబకాయానికి దారితీస్తుంది. రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు. దీని వల్ల తలనొప్పి, భారంగా అనిపిస్తుంది. తక్కువ నీరు తాగడం వల్ల మూత్రం చిక్కగా మారుతుంది. బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. శరీరంలో నీరు లేకపోవడం రక్త ప్రసరణ ప్రభావితం చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. దీనివల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గి బలహీనత కలుగుతుంది. ముడతలు, మచ్చలు, మొటిమలు కూడా వస్తాయి.
Similar News
News January 18, 2026
నాన్వెజ్ వండేటపుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

వంటగదిలో ఎంత శుభ్రత పాటించినా.. బ్యాక్టీరియా, వైరస్లు విజృంభిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా నాన్వెజ్ వండేటపుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. మాంసాహారంపై ఉండే హానికర బ్యాక్టీరియా కిచెన్లో వృద్ధిచెంది మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి నాన్వెజ్ వండే ముందు, వండేటప్పుడు, వండిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. మాంసాన్ని కడిగేటప్పుడు చేతులకు గ్లౌజ్లు వేసుకోవాలి. నాన్వెజ్ పాత్రలు విడిగా ఉంచాలి.
News January 18, 2026
ఐఐటీ ఢిల్లీలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేశారా?

<
News January 18, 2026
కనకాంబరంలో ఎండు తెగులు నివారణ ఎలా?

కనకాంబరంలో ఎండు తెగులు ముఖ్యమైన సమస్య. ఈ తెగులు ఆశించిన కనకాంబరం మొక్క ఆకులు వాలిపోయి, ఆకు అంచు పసుపు రంగుకు మారుతుంది. వేర్లు, కాండం, మొదలు కుళ్లడం వల్ల మొక్క అకస్మాత్తుగా ఎండిపోతుంది. దీంతో మొక్కలు గుంపులుగా చనిపోతాయి. ఎండు తెగులు నివారణకు తెగులు ఆశించిన మొక్కల మొదళ్లు తడిచేలా.. లీటరు నీటికి మాంకోజెబ్ 2.5గ్రా. కలిపి.. ఒక్కో మొక్కకు 20-25 మిల్లీ లీటర్ల ద్రావణాన్ని పోయాలి.


