News August 22, 2025

డ్రగ్స్ రహిత జిల్లాగా ఏలూరు: అడిషనల్ ఎస్పీ

image

ఏలూరు జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చాలని అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు అన్నారు. ఎస్పీ కె. ప్రతాప్ కిషోర్ ఆదేశాల మేరకు, వట్లూరులోని సి.ఆర్.ఆర్. రెడ్డి కళాశాలలో ఇన్‌స్పెక్టర్ కోటేశ్వరరావు, శక్తి టీమ్‌తో కలిసి “డ్రగ్స్ వద్దు బ్రో” కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసి భవిష్యత్తును నాశనం చేస్తాయని విద్యార్థులకు అవగాహన కల్పించారు.

Similar News

News January 22, 2026

అడిషనల్ కలెక్టర్ ఆస్తులు రూ.వందల కోట్లు

image

TG: గతనెలలో రూ.60వేల లంచం తీసుకుంటూ దొరికిన హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి ఇంట్లో ACB ఇవాళ రైడ్స్ చేసింది. సోదాల్లో రూ.4.65Cr విలువైన విల్లా, ఒక ఫ్లాట్, 8 ఓపెన్ ప్లాట్లు, 14.5 ఎకరాల వ్యవసాయ భూమి పేపర్లను స్వాధీనం చేసుకుంది. వీటి విలువ రూ.వందల కోట్లలో ఉంటుందని అంచనా. రూ.30లక్షల నగదు, 297 గ్రా. బంగారం, రూ.44.04 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తించింది. ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది.

News January 22, 2026

చక్రాయపాలెంలో ముగిసిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు

image

అద్దంకి మండలం చక్రాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు బుధవారంతో ముగిశాయి. ఈ పోటీల్లో మొదటి బహుమతి అద్దంకి సాధించగా, రెండో బహుమతి చక్రాయపాలెం అందుకుంది. మూడో స్థానంలో కొమ్మినేని వారిపాలెం నిలవగా విజేతలకు సీఐ సుబ్బరాజు హాజరై బహుమతులు ప్రదానం చేశారు.

News January 22, 2026

మదనపల్లి బస్టాండులో పెద్దమండెం వ్యక్తి మృతి..!

image

మదనపల్లి ఆర్టీసీ బస్టాండులో మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తి ఆచూకీ లభించింది. 2-టౌన్ SI రహీముల్లా, ఏఎస్ఐ రమణలు సీఐ ఆదేశాలతో దర్యాప్తు చేపట్టారు. మృతుడు పెద్దమండెం మండలం వెలిగల్లు కాలానీకి చెందిన శంకరప్ప కొడుకు<<18916147>> మారుతీగా గుర్తించారు.<<>> మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని ఏఎస్ఐ రమణ తెలిపారు.