News March 7, 2025
ఢిల్లీలో తన వాణి వినిపించిన ప.గో జిల్లా సర్పంచ్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో పంచాయతీ శాఖ నిర్వహిస్తున్న వర్క్ షాప్లో ఉండి మండలం మహాదేవపట్నం గ్రామ సర్పంచ్ వెంకట సుబ్బలక్ష్మి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు అని అన్నారు. తమ గ్రామంలో చేసిన అభివృద్ధి, చేయబోయే కార్యక్రమాల గురించి ఆమె వర్క్ షాప్లో వివరించారు.
Similar News
News March 7, 2026
మహిళా దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 8న జిల్లావ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. శనివారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. భీమవరంలోని విష్ణు కళాశాలలో జిల్లా స్థాయి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలన్నారు.
News March 7, 2026
6 వారాల పాటు విస్తృత అవగాహన కల్పించాలి: కలెక్టర్

‘వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్గార్’, అజీవికా మిషన్ పథకాలపై జిల్లావ్యాప్తంగా ఆరు వారాల పాటు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జేసీ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి ఈ పథకాలకు సంబంధించిన గోడపత్రికలు, కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, జీవనోపాధి అవకాశాలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడమే ఈ ప్రచార లక్ష్యమని తెలిపారు.
News March 6, 2026
ఆక్వా రైతుల నమోదును వేగవంతం చేయాలి: జేసీ

జిల్లాలోని ఆక్వా రైతుల సమస్యలపై జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి గురువారం భీమవరం కలెక్టరేట్లో మత్స్యశాఖ, తూనికలు-కొలతలు, వాణిజ్య పన్నులు, ఎంపెడ అధికారులతో సమీక్షించారు. ఆక్వా రైతులంతా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే, ఆక్వా ఫీడ్కు సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు.


