News August 23, 2025

ఢిల్లీ గడ్డపై.. తమిళనాడుతో రంగారెడ్డి బిడ్డ ఢీ

image

సెప్టెంబర్ 9న జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికలు ఈ ఏడాది రసవత్తరంగా జరుగనుంది. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల అభ్యర్థులు పోటీ చేస్తుండటంతో తెలంగాణ వర్సెస్ తమిళనాడు అని రాజకీయ నాయకులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, తమిళనాడుకు చెందిన బీజేపీ నేత సీపీ రాధాకృష్ణ ఉపరాష్ట్రపతి సీటుకోసం పోటీ పడుతున్నారు.

Similar News

News January 23, 2026

నిన్న విజయసాయి రెడ్డి.. మిథున్ రెడ్డి

image

AP: మద్యం కుంభకోణం కేసులో ED విచారణకు YCP MP మిథున్‌రెడ్డి హాజరయ్యారు. ఇదే కేసులో నిన్న విజయసాయిరెడ్డిని 7 గంటల పాటు ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని ED కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన పూర్తి సమాచారం రాజ్ కసిరెడ్డికే తెలుసని.. మిథున్ రెడ్డి కోరిక మేరకు ఆయనతో మీటింగ్ ఏర్పాటు చేశానని నిన్న విజయసాయి తెలిపారు. ఈ నేపథ్యంలో నేటి విచారణకు ప్రాధాన్యం ఏర్పడింది.

News January 23, 2026

న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ దూరం!

image

T20 WCకు ముందు న్యూజిలాండ్‌ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బౌలర్ ఆడమ్ మిల్నే టోర్నీకి దూరమయ్యారు. SA20లో ఆడుతుండగా ఎడమ తొడ కండరాలకు తీవ్ర గాయమైంది. దీంతో అతడి స్థానంలో కైల్ జేమీసన్‌ను NZ రీప్లేస్ చేసింది. ఓరూర్కీ, టిక్నర్, నాథన్ స్మిత్, బెన్ సీర్స్ ఇప్పటికే గాయపడ్డారు. ఫెర్గ్యూసన్, మ్యాట్ హెన్రీ పెటర్నిటీ లీవ్స్‌ కారణంగా WCలో కొన్ని మ్యాచులకు దూరమయ్యే అవకాశముంది.

News January 23, 2026

MHBD: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓటరు ప్రతిజ్ఞ

image

ఓటు ప్రాధాన్యత గురించి ప్రతిఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఉందని, 18 సం.లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అద్వైత కుమార్ సింగ్ సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో “జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని” పురస్కరించుకొని కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాధికారులు, కలెక్టరేట్ కార్యాలయ సిబ్బందితో కలెక్టర్ ఓటరు ప్రతిజ్ఞ చేయించారు.