News September 10, 2025
ఢిల్లీ చేరిన జిందాల్ భూ నిర్వాసితులు

ఎస్.కోట మండలం బొడ్డవరలో 80 రోజులుగా నిరసన తెలిపిన జిందాల్ భూ నిర్వాసితులు చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టడం తెలిసిందే. ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీకి బయలుదేరిన వీరు బుధవారం చేరుకున్నట్లు జగన్ తెలిపారు. ప్రభుత్వం గిరిజన సమస్యలపై స్పందించకపోవడంతో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి, మానవ హక్కుల సంఘాలకు గిరిజనుల సమస్యలను తెలియపరచనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 14, 2025
VZM: రెచ్చిపోయిన దొంగలు.. ఒకేసారి 5 ఆలయాల్లో చోరీ

వేపాడ మండలం బానాదిలో శనివారం రాత్రి 5 దేవాలయాల్లోని హుండీలో సొమ్మును దొంగలు అపహరించినట్లు SI సుదర్శన్ తెలిపారు. శివాలయం, వినాయకుడు, హనుమాన్, పరదేశమ్మ, మరిడిమాంబ ఆలయాల్లో హుండీలను పగలగొట్టి సొమ్ము దొంగలించినట్లు వెల్లడించారు. దొంగలించిన సోమ్ము సుమారు రూ.41 వేలు ఉంటుందన్నారు. క్లూస్ టీమ్తో తనిఖీలు నిర్వహించారు. అర్చకుడు కిషోర్ శర్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు SI పేర్కొన్నారు.
News December 14, 2025
విజయనగరం కలెక్టరేట్లో రేపు PGRS: కలెక్టర్

విజయనగరం కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు PGRS నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్జీదారులు పూర్వపు స్లిప్పులతో రావాలని సూచించారు. అర్జీల కోసం 1100 కాల్ సెంటర్, Meekosam.ap.gov.in సేవలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
News December 13, 2025
ఈనెల 14 నుంచి ఇంధన పొదుపు వారోత్సవాలు: CMD

ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించాలని APEPDCL సీఎండీ పృథ్వీ తేజ్ సిబ్బందికి ఆదేశించారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విభిన్న కార్యక్రమాలు చేపట్టి అన్ని వర్గాల విద్యుత్ వినియోగదారులకు ఇంధన పొదుపుపై అవగాహన కల్పించాలని శనివారం కోరారు. కళాశాల విద్యార్థులకు వర్క్షాప్లు, పాఠశాల విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని సూచించారు.


