News December 6, 2025
తమిళనాడులో ప్రమాదం.. ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు మృతి

తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. అర్ధరాత్రి రామనాథపురంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు రామేశ్వరం ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఐదుగురు మరణించగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు విజయనగరం జిల్లా కొరప కొత్తవలస, మరుపల్లికి చెందినవారిగా గుర్తించారు.
Similar News
News January 19, 2026
నెల్లూరు: విజయ డెయిరీ ఛైర్మన్గా ప్రసాద్ నాయుడు.?

నెల్లూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాలే లక్ష్యంగా టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. విజయ డైరీ (పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సమితి) ఛైర్మన్ అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం కోరుటూరుకి చెందిన ఆర్.వి. ప్రసాద్ నాయుడును ఖరారు చేసింది.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆయన ఎంపిక లాంఛనమే కానుంది.
News January 19, 2026
గుడ్డుపై అపోహలు.. వైద్యులు ఏమన్నారంటే?

కొలెస్ట్రాల్ భయంతో గుడ్లు తినడం మానేశారా? అయితే ఈ విషయం మీ కోసమే. గుడ్లు తింటే రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందనే అపోహను శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. రోజుకు ఒకటి, రెండు గుడ్లు తిన్నా ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు లేదని పైగా శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు అందుతాయని డాక్టర్లు చెబుతున్నారు. గుండె ఆరోగ్యంపై దీని ప్రభావం స్వల్పమేనని, సమతుల్య ఆహారంలో భాగంగా ఎగ్ తినాలని సూచిస్తున్నారు.
News January 19, 2026
బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ఇలా చెయ్యండి

ప్రస్తుతకాలంలో మారిన జీవనశైలి వల్ల చాలామందిలో బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతోంది. దీనివల్ల డయాబెటిస్, హై బీపీ, గుండె జబ్బులు, లివర్ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువవుతాయంటున్నారు నిపుణులు. ఆహారంలో తెల్ల బియ్యం, మైదా, స్వీట్స్, జంక్ ఫుడ్ తగ్గించడం, ప్రొటీన్ ఎక్కువగా తీసుకోవడం, క్రమంగా వ్యాయామం, మంచి నిద్ర ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తూ స్ట్రెస్ తగ్గించుకోవాలని చెబుతున్నారు.


