News September 10, 2025

తర్లుపాడు MPDOపై సస్పెన్షన్ వేటు

image

తర్లుపాడు MPDO చక్రపాణి ప్రసాద్‌పై పబ్లిక్ సర్వీసెస్ జిల్లా అధికారులు వేటు వేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కంటింజెంట్ వర్కర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చక్రపాణిపై దర్యాప్తు జరిపి ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. MPDOపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. కమిటీ విచారణ, ప్రాథమిక సాక్ష్యంతో సస్పెండ్ చేశారు.

Similar News

News December 8, 2025

OGL: పెళ్లికి ఒప్పుకోలేదని యువతి సూసైడ్

image

ఒంగోలులో యువతి <<18495938>>ఆత్మహత్యకు <<>>యువకుడి మోసమేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. కబాడిపాలేనికి చెందిన నళిని(33) ఎంటెక్ చదివింది. మహేంద్ర నగర్‌కు చెందిన సింగోతు శ్రీనివాస్ ప్రేమ పేరిట దగ్గరై ఆమెను లొంగదీసుకున్నాడు. కులాలు వేరు కావడంతో పెళ్లి కష్టమని చెప్పాడు. దీంతో నళిని పెళ్లి గురించి మాట్లాడటానికి యువకుడి ఇంటికి శనివారం వెళ్లగా వాళ్లు లోపలకు రానివ్వలేదు. మనస్తాపానికి గురైన యువతి ఇంటికొచ్చి ఉరేసుకుంది.

News December 7, 2025

ప్రకాశం: NMMS -2025 పరీక్షకు 196 మంది గైర్హాజరు

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన NMMS -2025 స్కాలర్షిప్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించినట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. మొత్తం 19 కేంద్రాల్లో 4009 మంది విద్యార్థులకు గాను 3813 మంది హాజరయ్యారన్నారు. 196 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగిందని డీఈవో తెలిపారు.

News December 7, 2025

ప్రకాశం ప్రజలకు కలెక్టర్ కీలక సూచన.!

image

ఒంగోలులోని కలెక్టరేట్లో ఈనెల 8న జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజాబాబు కోరారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం ఆదివారం ప్రకటన విడుదల చేసింది. మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను ప్రజలు వినియోగించుకోవాలని, అర్జీల స్థితిగతులను అర్జీదారులు కాల్ సెంటర్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. గతంలో ఇచ్చిన అర్జీలు పరిష్కారం కానివారు వాటి స్లిప్పులను తీసుకురావాలన్నారు.