News August 9, 2024

తాండూర్: సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం

image

గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైన ఘటన తాండూరు మండలం మాదారం టౌన్షిప్‌లో చోటుచేసుకుంది. బాధితులు మాట్లాడుతూ.. ఇంట్లో దాచుకున్న రూ.లక్ష నగదుతో సహా బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులు దగ్ధమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న MPDO శ్రీనివాస్, ఆర్ఐ అంజన్ కుమార్ ఘటన స్థలాన్ని సందర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు.

Similar News

News December 17, 2025

ఆదిలాబాద్: సమస్యలు సృష్టించే 756 మంది బైండోవర్

image

ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో గొడవలు సృష్టించే అవకాశం ఉన్న 756 మందిని బైండోవర్ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 20 మంది వద్ద ఉన్న ఆయుధాలను కూడా సేఫ్ డిపాజిట్ చేయడం జరిగిందన్నారు. మూడు విడతల బందోబస్తులో ఫారెస్ట్, టీజీఎస్‌పీ, ఏసీటీపీసీ సిబ్బంది పాల్గొంటున్నారని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

News December 16, 2025

ADB: మూడో దశ ఎన్నికలకు 938 మంది పోలీసులతో బందోబస్తు: ఎస్పీ

image

ఆదిలాబాద్‌ జిల్లాలో ఆరు మండలాలలో జరగనున్న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. 37 క్లస్టర్లు, 25 రూట్లలో, 151 గ్రామాల పరిధిలోని 204 పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 938 మంది పోలీసు సిబ్బందితో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు.

News December 16, 2025

ADB: సోషల్‌ మీడియాపై నిఘా: ఎస్పీ

image

ఆదిలాబాద్‌ జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా వాట్సాప్‌, సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టేవారిపై పోలీసులు నిఘా ఉంచారని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. ప్రచారం ముగిసిన తర్వాత బయటి వ్యక్తులు గ్రామాల్లో ఉండరాదన్నారు. ఎలాంటి సమాచారం ఉన్నా డయల్‌ 100కు తెలియజేయాలని సూచించారు. గొడవలు, అల్లర్లకు పాల్పడకూడదని, ఎన్నికలు పూర్తయ్యాక విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు.