News February 10, 2025

తాడేపల్లి: జగన్ ఇంటి వద్ద కెమెరాలు 

image

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద మెగా కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. ఇటీవల ఆయన నివాసం వద్ద చెలరేగిన మంటలను దృష్టిలో ఉంచుకుని అక్కడ నిఘా పెంచారు. మొత్తం ఎనిమిది కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటి నుంచి వచ్చే చిత్రాలను తాడేపల్లి పోలీస్ స్టేషన్‌ నుంచి మానిటర్ చేయనున్నారు.

Similar News

News April 17, 2026

GNT: పద్మ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

2027 పద్మ పురస్కారాలకు గానూ క్రీడాకారుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు డీఎస్‌వో అఫ్రోజ్ ఖాన్ గురువారం తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు ఇందుకు అర్హులన్నారు. ఆసక్తిగలవారు తమ పత్రాలను వర్డ్, పీడీఎఫ్ ఫార్మాట్‌లో మే 15లోపు sportsinap@gmail.comకు మెయిల్ చేయాలి. పూర్తి వివరాలకు awards.gov.in చూడొచ్చు. ఎంపిక చేసిన అర్హుల జాబితాను కేంద్రానికి సిఫార్సు చేయనున్నారు.

News April 17, 2026

ప్రభుత్వ పాఠశాలల్లో ‘త్రీ స్టార్’ వసతులు కల్పించాలి: లోకేశ్

image

ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నత విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేశ్ కీలక సమీక్ష నిర్వహించారు. విద్యాసంస్థల్లో సిబ్బంది, విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ముఖ ఆధారిత గుర్తింపు పురోగతిపై ఆరా తీశారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై చర్చించిన ఆయన, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ‘త్రీ స్టార్’ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు కల్పించాలని, విద్యార్థులకు అత్యుత్తమ వసతులు అందించాలని అధికారులను ఆదేశించారు.

News April 16, 2026

విజయవాడలో హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత!

image

వైద్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బాధితుడి కుటుంబ సభ్యులు విజయవాడలోని ఓ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. బాధితుడి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. మంగళగిరికి చెందిన సుభాని (31) అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. వైద్యులు ఇంకా నగదు చెల్లించాలని డిమాండ్ చేశారు. తాము ఇంకా నగదు చెల్లించలేమని హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.