News November 8, 2025
తానూరు: దాబాలో ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య

తానూరు మండలం బామ్ని గ్రామానికి చెందిన బాశెట్టి రాజు(41) భోసి గ్రామ సమీపంలోని ఓ దాబాలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాశెట్టి రాజు కొద్ది రోజులుగా దాబాలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం దాబాలో అర్ధరాత్రి దాటిన తర్వాత రాజు మద్యం మత్తులో ఉరేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News January 22, 2026
రోడ్డు మీద వెళ్తుంటే డబ్బు దొరికిందా?

రోడ్డుపై వెళ్తుంటే డబ్బు దొరకడం యాదృచ్చికం కాదని, భగవంతుడి సంకేతమని జ్యోతిషులు చెబుతున్నారు. ‘నాణెం దొరికితే కొత్త పనుల్లో విజయం, ఆర్థిక లాభాలు సిద్ధిస్తాయి. నోటు దొరకడం లక్ష్మీదేవి కటాక్షానికి సూచిక. ఇలా దొరికిన సొమ్మును ఖర్చు, దానం చేయకూడదు. దైవ ప్రసాదంగా భావించి, పర్సు/పూజా గదిలో భద్రపరచాలి. తద్వారా మనిషికి/ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఉదయం వేళ డబ్బు దొరకడం రెండింతలు అదృష్టం’ అంటున్నారు.
News January 22, 2026
SECLలో 66 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

సౌత్ ఈస్ట్రన్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (<
News January 22, 2026
GHMC కమిషనర్ కొత్త ఆఫీస్లు ఎక్కడో తెలుసా?

ఫిబ్రవరి 10 తర్వాత GHMC 3 కార్పొరేషన్లు (హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి)గా విడిపోనుంది. దీంతో కొత్త కార్పొరేషన్ల కార్యాలయాలు ఈ ప్రాంతాల్లో ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం ఉన్న GHMC కార్యాలయంలోనే హైదరాబాద్, తార్నాక పాత HMDA కార్యాలయంలో మల్కాజిగిరి, మాదాపూర్లోని నేషనల్ అకాడమి ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) బిల్డింగ్లో సైబరాబాద్ కార్పొరేషన్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నట్లు తెలిసింది.


