News August 11, 2025
తిరుపతి: ఒత్తిడి తట్టుకోలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్!

నెల్లూరులోని ఓ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాచపాళెం గ్రామానికి చెందిన తిరుపతయ్య, వేదవతి దంపతుల కుమార్తె హేమశ్రీకి పదో తరగతిలో 550 మార్కులు వచ్చాయి. నెల్లూరులోని ఓ కళాశాల యాజమాన్యం ఆమెను MPCలో చేర్చుకుంది. అయితే ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని సెక్షన్ మార్చాలని అడిగేది. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు కాల్ చేసి చెప్పి ఉరేసుకుంది.
Similar News
News March 14, 2026
కొత్తవలస: యాక్సిడెంట్.. లారీ డ్రైవర్ మృతి

కొత్తవలస మండలం కంటకాపల్లి రైల్వే సైడింగ్ వద్ద శనివారం ప్రమాదం జరిగింది. ఎల్.కోట మండలంలో ఓ కంపెనీకి చెందిన లారీ డ్రైవరు బొగ్గు లోడింగ్ కోసం కంటకాపల్లి రైల్వే సైడింగ్కు వచ్చాడు. లారీ డ్రైవరు లారీకి టార్పాలిన్ కడుతూ ఉండగా జారిపోయి పడిపోయాడు. ఆ సమయంలో అటుగా మరోలారీ రావడంతో ఆ లారీ కిందపడి మృతి చెందాడు.
News March 14, 2026
యుద్ధం ఎఫెక్ట్.. చిత్తూరు జిల్లాలో పెరిగిన వాటర్ బాటిల్ ధరలు?

చిత్తూరులో శనివారం జిల్లా <<19383334>>వాటర్<<>> అసోసియేషన్ ఆధ్వర్యంలో సమీక్ష జరిగింది. యుద్ధ ప్రభావంతో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తయారీకి అవసరమైన రా మెటీరియల్ ధరలు భారీగా పెరిగాయని తయారీదారులు అంటున్నారు. దీని వలన తమపై అధిక భారం పడుతోందని, దీంతో వాటర్ బాటిల్ ధరలను తప్పనిసరిగా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పెంచిన ధరలకు డీలర్లు సహకరించాలని జిల్లా వాటర్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.
News March 14, 2026
ప.గో: భార్య గొంతు కోసిన భర్త

భార్య గొంతును బ్లేడుతో కోసి తీవ్రంగా గాయపరిచిన ఘటన శనివారం తణుకులో చోటుచేసుకుంది. కరగాని దిల్లేశ్వరి భర్త గోవిందు మధ్య మనస్పర్ధల కారణంగా కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం ఆమె పని చేస్తున్న డ్రై ఫ్రూట్స్ షాపు వద్దకు వచ్చి తనను బండిపై ఇంటికి తీసుకు వెళ్లాలని కోరాడు. ఆమె బండి నడుపుతుండగా వెనక కూర్చున్న గోవిందు తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో పీక కోసి పరారయ్యాడు.


