News March 4, 2025
తిరుపతి: తల్లి ఆచూకీ కోసం తల్లడిల్లుతున్న జవాను

తిరుపతి జిల్లా తిరుమల లోని తన తల్లి ఆచూకీ తెలిస్తే చెప్పండి అంటూ ఒక జవాను సెలవు పెట్టి తిరుపతి పరిసర ప్రాంతాల్లో చేతిలో ఫొటో పట్టుకొని వెతుకుతున్నాడు. సెలవులు ముగిసి నేపాల్ సరిహద్దులో ఉద్యోగానికి వెళ్లలేక ఇటు తల్లి ఆచూకీ కానరాక తల్లికోసం జవాను తల్లడిల్లుతున్నాడు. సోమవారం తిరుపతి కలెక్టర్ని కలిసి తన తల్లి మిస్సింగ్ కేసును సీరియస్గా తీసుకోమని ఫిర్యాదు చేశాడు.
Similar News
News December 10, 2025
తిరుపతి: కళ్లు లేకున్నా.. 200KM స్కేటింగ్

తిరుపతి జిల్లాకు చెందిన అంధ స్కేటర్ మురారి హర్షవర్ధన్ నాన్స్టాప్గా 200 KM బ్లైండ్ స్కేటింగ్ మారథాన్ చేశాడు. ఆర్టిస్టిక్, మల్టీటాస్క్ విభాగాల్లో ప్రపంచ రికార్డులు సాధించాడు. సంబంధిత సర్టిఫికెట్లను తిరుపతిలో మంగళవారం సాయంత్రం బాలుడికి అందజేశారు. వండర్ బుక్, జీనియస్ బుక్, వజ్ర రికార్డ్స్ ప్రతినిధులు పురస్కారాలు ఇచ్చారు. హర్షవర్ధన్ అందరికీ ఆదర్శమని పలువురు పేర్కొన్నారు.
News December 10, 2025
శరీరంలో ఈ మార్పులు వస్తే జాగ్రత్త!

చాలా మంది కిడ్నీ సమస్యలను త్వరగా గుర్తించకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో వచ్చే కొన్ని మార్పులను గమనించి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. తక్కువ లేదా రాత్రి వేళల్లో అతి మూత్రం, మూత్రంలో నురుగు/ఎర్రటి రంగు, ముఖం/పాదాలు లేదా శరీరం ఉబ్బినట్లు అనిపిస్తే జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు. బీపీ పెరుగుతున్నా కిడ్నీ సమస్యలుగా గుర్తించాలని చెబుతున్నారు.
News December 10, 2025
నాగార్జున సాగర్@70ఏళ్లు

కృష్ణా నదిపై నిర్మించిన ఆనకట్టల్లో నాగార్జున సాగర్ అతి పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు. దీనికి శంకుస్థాపన చేసి నేటికి 70 ఏళ్లు. 1955 DEC 10న ఆనాటి PM నెహ్రూ పునాది రాయి వేశారు. 1967లో ఇందిరా గాంధీ కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. 1911లోనే నిజాం ఈ ప్రాంతంలో ఆనకట్ట కట్టాలని అనుకున్నా కార్యరూపం దాల్చలేదు. సాగర్ నుంచి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సాగునీరు అందుతోంది.


