News January 10, 2026

తిరుపతి: ప్రతి పాఠశాలకు ప్రత్యేకాధికారి..!

image

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు లక్ష్యంగా విద్యాశాఖ ప్రత్యేకాధికారిని నియమించింది. విద్యార్థుల బోధన, చదవడం, పరీక్షలు, పది విద్యార్థుల స్టడీ అవర్స్.. 100 శాతం ఉత్తీర్ణత కోసం వీరి పర్యవేక్షణ ఉంటుంది. పిలల్ల సామర్ధ్యాలపై ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాల పదో తరగతి విద్యార్థులు 13,675 మంది, మున్సిపాలిటి పాఠశాలల్లో 972 మంది చదువుతున్నారు.

Similar News

News January 20, 2026

ఎల్బీనగర్ మెట్రోలో GOOD ‘మెసేజ్’

image

ఎప్పుడూ బిజీగా ఉండే మెట్రోలో మంగళవారం ఓ వింత దృశ్యం కనిపించింది. ఎల్బీనగర్ వెళ్లే రైలులో ఎవరో ఒక ‘జెన్-జీ’ కుర్రాడో, అమ్మాయో అతికించిన గ్రీన్ స్టిక్కీ నోట్స్ ప్రయాణికుల మనసు గెలుచుకుంటున్నాయి. “ప్రతిఫలం ఆశించకుండా సాయం చెయ్.. నీ మనసు చెప్పిందే విను” అంటూ డయానా చెప్పిన మంచి మాటలను ఆ నోట్స్‌పై రాశారు. యాంత్రికమైన ఈ కాలంలో నలుగురికి మంచిని పంచాలనే ఈ చిన్న ప్రయత్నం ప్రయాణికుల్లో నవ్వులు పూయించింది.

News January 20, 2026

ఎల్బీనగర్ మెట్రోలో GOOD ‘మెసేజ్’

image

ఎప్పుడూ బిజీగా ఉండే మెట్రోలో మంగళవారం ఓ వింత దృశ్యం కనిపించింది. ఎల్బీనగర్ వెళ్లే రైలులో ఎవరో ఒక ‘జెన్-జీ’ కుర్రాడో, అమ్మాయో అతికించిన గ్రీన్ స్టిక్కీ నోట్స్ ప్రయాణికుల మనసు గెలుచుకుంటున్నాయి. “ప్రతిఫలం ఆశించకుండా సాయం చెయ్.. నీ మనసు చెప్పిందే విను” అంటూ డయానా చెప్పిన మంచి మాటలను ఆ నోట్స్‌పై రాశారు. యాంత్రికమైన ఈ కాలంలో నలుగురికి మంచిని పంచాలనే ఈ చిన్న ప్రయత్నం ప్రయాణికుల్లో నవ్వులు పూయించింది.

News January 20, 2026

‘జారుతున్న బతుకులు’.. గౌడన్నల గోసపై ప్రత్యేక కథనం

image

తిర్యాణి మండలంలో సుమారు 500 గౌడ కుటుంబాలు గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. మండలంలో కొన్ని ప్రాంతాలు ఏజెన్సీలో ఉండడంతో ఇక్కడ జీవిస్తున్న గీత కార్మికులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడంలేదు. ఎత్తయిన తాడి చెట్ల నుంచి జారుతూ పిట్టలా రాలిపోతున్నా తమను పట్టించుకునే వారే లేరని గౌడ కుటుంబాలు వాపోతున్నాయి. ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గౌడ కులస్థులను ఆదుకోవాలని గీత కార్మికులు కోరుతున్నారు.